దుఖాన్ని దిగమింగి ఫోటోలిచ్చిన సమంత!
తాజాగా సమంత కూడా అలాంటి దుఖాన్ని దిగమింగి అభిమానులతో సంతోషంగా ఉండాల్సిన ఓ సందర్బం ఎదురైంది.
By: Tupaki Desk | 11 May 2025 1:00 AM ISTదుఖం..సంతోషం ప్రతీ ఒక్కరి జీవితంలోనూ సహజం. అందుకు ఎవరీ అతీతులు కారు. కానీ సెలబ్రిటీ లైఫ్ లో దుఖాన్ని దిగమింగి బయటకు సంతోషంగా కనిపించాల్సిన సందర్భాలొస్తుంటాయి. గుండెల్లో మోయ లేనంత భారమున్నా? చిరు నవ్వుతో స్వీకరించాల్సిన సామార్ధ్యం మాత్రం అందరికీ సాధ్యం కాదు. సూపర్ స్టార్ మహేష్..యంగ్ టైగర్ ఎన్టీఆర్ కుటుంబంలో జరిగిన సంఘటనలు గుర్తు చేసుకుని పబ్లిక్ గా కన్నీరు చెమర్చిన సందర్భాలున్నాయి.
మహేష్ కుటుంబంలో ఒకే ఏడాది అనుకోని సంఘటనలు చోటు చేసుకోవడంతో మహేష్ ఎంతగా బాధపడ్డారు? అన్నది `సర్కారు వారి పాట` ప్రీరిలీజ్ ఈవెంట్ లో బయట పడింది. అంతకు ముందు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తండ్రి...అన్నయ్య అకాల మరణం విషయంలో ఇప్పటికీ ఎమోషనల్ అయ్యారు. తాజాగా సమంత కూడా అలాంటి దుఖాన్ని దిగమింగి అభిమానులతో సంతోషంగా ఉండాల్సిన ఓ సందర్బం ఎదురైంది.
ఆ సంఘటన ఏంటంటే? సమంత తండ్రి చనిపోయిన విషయాన్ని తల్లి వెంటనే ఫోన్ చేసి చెప్పింది. ఆ మాట వినగానే సమంత ఒక్కసారిగా షాక్ అయింది. అయితే అప్పటికే తండ్రితో కొంత కాలంగా సమంత మాట్లాడటం లేదు. దీంతో ఆరోజు ఏం జరుగుతుందో తనకి అర్దం కాలేదు. అప్పుడు ముంబైలో ఉంది. విషయం తెలిసి వెంటనే బయల్దేరగా మధ్యలో చాలా మంది అభిమానులు తారసపడ్డారు.
ఫోటోలు కావాలని అడిగారు. అయినా వాళ్ల మాట కాదనకలేక నవ్వుతూ కెమెరాకు ఫోజులిచ్చింది. లోలోపల తండ్రి చనిపోయాడన్న దుఖం ఉబికి వస్తున్నా? అదుపు చేసుకుని ఫోటోలిచ్చింది. అభిమానులను బాధ పెట్టడం ఇష్టం లేక ఆరోజు అలా చేసినట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేసింది. అభిమానుల వల్లే నేడు ఈ స్థానంలో ఉన్నట్లు గుర్తు చేసుకుంది.