Begin typing your search above and press return to search.

సలార్ 2 లో అది వంద రెట్లు అధికం..!

తాజాగా సలార్‌ లో శౌర్యంగ గా కనిపించిన బాబీ సింహా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

By:  Tupaki Desk   |   16 March 2024 3:49 AM GMT
సలార్ 2 లో అది వంద రెట్లు అధికం..!
X

యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా కన్నడ స్టార్‌ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొంది గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన సలార్‌ 1 సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రభాస్‌ ఫ్యాన్స్ తో పాటు యాక్షన్ సినిమాలను ఇష్టపడే ప్రతి ఒక్కరికి కూడా విందు భోజనం వంటి సినిమాను సలార్ తో ప్రశాంత్ నీల్ ఇచ్చాడు.

సలార్ 1 సూపర్‌ హిట్ అయిన నేపథ్యంలో సలార్ 2 (శౌర్యంగ పర్వం) కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సలార్ 1 చూసిన వారిలో ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. వాటన్నింటికి సలార్‌ 2 లో సమాధానాలు లభించబోతున్నాయి. సలార్‌ 2 పై నటీ నటులు సాంకేతిక నిపుణులు రోజు రోజుకు అంచనాలు పెరిగే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.

తాజాగా సలార్‌ లో శౌర్యంగ గా కనిపించిన బాబీ సింహా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆయన సలార్‌ 2 గురించి చేసిన వ్యాఖ్యలు అంచనాలను మరింతగా పెంచుతున్నాయి. బాబీ సింహా మాట్లాడుతూ... సలార్‌ 1 క్లైమాక్స్ లో ఎలాంటి గూజ్‌ బంప్స్ సన్నివేశాలు ఉన్నాయో సలార్‌ 2 లో అంతకు మించి అన్నట్లుగా ఉంటాయి.

సలార్ శౌర్యంగ పర్వం లో వంద రెట్లు అధికంగా గూజ్ బంప్స్ వచ్చే విధంగా సన్నివేశాలు ఉంటాయని, ముఖ్యంగా సలార్ 2 క్లైమాక్స్ ప్రేక్షకులకు చాలా సర్‌ప్రైజింగ్ గా ఉంటుందని ఆయన చెప్పుకొచ్చాడు. ఇటీవల వరదరాజ మన్నార్ పాత్రలో నటించిన పృథ్వీరాజ్ సుకుమారన్‌ కూడా సలార్‌ 2 పై అంచనాలు పెంచే విధంగా వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే.

ప్రభాస్ ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి సినిమా లో నటిస్తున్నాడు. మరో వైపు మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఈ ఏడాది ద్వితీయార్థం లో ప్రభాస్ తో సలార్ 2 ను దర్శకుడు ప్రశాంత్ నీల్‌ షురూ చేసేందుకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టాడు. సలార్‌ 2 కోసం 2026 వరకు వెయిట్‌ చేయాల్సి ఉండొచ్చు అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్‌..!