Begin typing your search above and press return to search.

ముంబైలో సాయిప‌ల్ల‌వి.. కార‌ణ‌మిదేనా?

ఈ చిత్రంలో సాయిప‌ల్ల‌వి సీత‌గా న‌టించే వీలుంద‌ని కూడా క‌థ‌నాలొచ్చాయి. ఈ చిత్రం చుట్టూ చాలా బజ్ ఉంది. ప్ర‌స్తుతం ముంబై నుంచి ఓ ఫోటో అంత‌ర్జాలంలో వైరల్ అవుతోంది.

By:  Tupaki Desk   |   13 Nov 2023 2:30 AM GMT
ముంబైలో సాయిప‌ల్ల‌వి.. కార‌ణ‌మిదేనా?
X

ఆదిపురుష్ ప‌రాజ‌యం త‌ర్వాత నితీష్ తివారీ 'రామాయ‌ణం' ప్ర‌య‌త్నాలు హాట్ టాపిక్ గా మారాయి. అల్లు అర‌వింద్- మ‌ధుమంతెన బృందం నితీష్ తో క‌లిసి ఈ భారీ చిత్రాన్ని నిర్మించ‌నున్నార‌ని కూడా క‌థ‌నాలొచ్చాయి. ఇందులో రణబీర్ కపూర్ శ్రీ‌రాముడిగా న‌టించనుండ‌గా, రాకింగ్ స్టార్ య‌ష్ రావ‌ణాసురుడిగా న‌టిస్తార‌ని ఇప్ప‌టికే క‌థ‌నాలొచ్చాయి. య‌ష్ పై ఫోటోషూట్ కూడా ఇంత‌కుముందే పూర్త‌యింది.

ఈ చిత్రంలో సాయిప‌ల్ల‌వి సీత‌గా న‌టించే వీలుంద‌ని కూడా క‌థ‌నాలొచ్చాయి. ఈ చిత్రం చుట్టూ చాలా బజ్ ఉంది. ప్ర‌స్తుతం ముంబై నుంచి ఓ ఫోటో అంత‌ర్జాలంలో వైరల్ అవుతోంది. ఈ ఫోటో సాయిప‌ల్ల‌విది. దీంతో సాయి పల్లవి ముంబైలో ఉంద‌ని, రామాయణం ప్రారంభోత్సవంలో పాల్గొంటుంద‌ని ఒక సెక్ష‌న్ సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు.

ప్రస్తుతం ఆన్‌లైన్‌లో రెడ్డిట్ పోస్ట్ చ‌ర్చ‌గా మారింది. సాయి ముంబైలో ఉన్నట్లు వెల్ల‌డించింది రెడ్డిట్ వినియోగ‌దారు. సినిమా స్వరూపాన్ని బట్టి ఈ సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. ఇది హిందూ ఇతిహాసం రామాయ‌ణం క‌థ ఆధారంగా రూపొంద‌నుంది. అయితే తారాగ‌ణంపై అభిమానుల్లో ర‌క‌ర‌కాలుగా చ‌ర్చ సాగుతోంది. ఇప్ప‌టికే కొంద‌రు రణబీర్ కపూర్‌ను రాముడిలా చూడలేకపోతున్నామని అంటున్నారు. రాముడిగా నటించిన టీవీ తారల గురించి కొందరు మాట్లాడుతున్నారు. సాయి పల్లవి సీతగా అద్భుతంగా ఉంటుందని భావించే అభిమానులు కూడా ఉన్నారు. కానీ కొందరు ఆమెను సీతగా చూడలేమ‌ని కూడా వ్యాఖ్యానిస్తున్నారు. సాంప్రదాయ దుస్తులలో ఆమె లుక్స్ కూడా షేర్ అయ్యాయి. ఇతర నటీనటుల గురించి కూడా నెటిజ‌నులు ప్రశ్నిస్తున్నారు. రావణుడు, హనుమంతుడు గురించి చ‌ర్చ సాగుతోంది. యష్ - సన్నీ డియోల్ వంటి వారు ఈ చిత్రంలో న‌టించే వీలుంద‌ని టాక్ వినిపిస్తోంది.

రామాయణం గురించి కానీ, ఇందులో న‌టించే నటీనటుల ఎంపిక గురించి కానీ నిర్మాత‌లు ఇంకా అధికారికంగా ఏదీ ధృవీకరించలేదు. అయితే రెడ్డిట్ లో తారాగణం స‌హా సిబ్బంది గురించి త్వ‌ర‌లో ప్రకటించ‌నున్నార‌ని ఒక పోస్ట్ లో పేర్కొన్నారు. ఇది నిజమైతే రామాయణంపై సినిమా ప్రకటించడానికి ఇంకెంతో స‌మ‌యం ప‌ట్టుక‌పోవ‌చ్చనేది టాక్.