నీ లాంటి వాళ్లు పనిచేయడం మాకు సిగ్గుచేటు
జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి వల్ల అమాయకులైన 26 మంది భారతీయుల్ని దేశం కోల్పోయింది.
By: Tupaki Desk | 9 May 2025 7:30 PMజమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి వల్ల అమాయకులైన 26 మంది భారతీయుల్ని దేశం కోల్పోయింది. దానికి ప్రతీకారంగా ఇండియన్ ఆర్మీ పాక్ ఉగ్రస్థావరాలపై దాడి చేసి ఎంతోమంది ఉగ్రవాదులను మట్టి కరిపించింది. ఆపరేషన్ సిందూర్ పేరిట ఈ మిషన్ ను మొదలుపెట్టి ఎంతో సక్సెస్ఫుల్ గా ఉగ్రవాదులపై ఎటాక్ చేసింది ఇండియన్ ఆర్మీ.
పాక్ ఇండియాపై చేసిన ఉగ్రదాడి నేపథ్యంలో ఇండియాలో పాకిస్తాన్ నటుడు ఫవాద్ ఖాన్ చేసిన అబీర్ గులాల్ సినిమా ఇండియా బ్యాన్ చేసింది. దీంతో భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పై పాక్ నటుడు పవాద్ సంచలన పోస్ట్ పెట్టాడు. పాకిస్తాన్ పై ఇండియా దాడి చేయడం సిగ్గు చేటని, ఇలాంటి వాటిని ఎవరూ స్వాగతించరని పోస్ట్ చేయడంతో దాంతో పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది.
ఫవాద్ ఖాన్ ఇండియాపై చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ నటి రూపాలీ గంగూలీ రెస్పాండ్ అవుతూ వాటిని ఖండించారు. సోషల్ మీడియా వేదికగా అతన్ని విమర్శిస్తూ మీలాంటి వాళ్లు భారతీయ సినిమాల్లో పనిచేయడం మాకు సిగ్గు చేటు అంటూ అతని ఫోటోను షేర్ చేస్తూ దానికి ఆపరేషన్ సిందూర్, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ఫోర్స్ హ్యాష్ ట్యాగ్స్ ను యాడ్ చేశారు.
ప్రస్తుతం రూపాలీ గంగూలీ, ఫవాద్ ఖాన్ ను విమర్శిస్తూ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా, ఆల్రెడీ ఫవాద్ ఖాన్, మహీరా ఖాన్ చేసిన వ్యాఖ్యలను ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ ఖండిస్తూ వారిని వెంటనే ఇండియన్ మూవీ ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలని, కళల పేరుతో ఇలాంటివారికి మద్దతు ఇవ్వొద్దని తెలిపింది.