Begin typing your search above and press return to search.

సప్తసాగరాలు దాటి బ్యూటీని పట్టిన రామ్‌..!

సప్తసాగరాలు దాటి తో సెన్షేషనల్‌ స్టార్‌ గా మారిన హీరోయిన్‌ రుక్మిణి వసంత్‌ తో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రతినిధులు చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం అందుతోంది.

By:  Tupaki Desk   |   10 Nov 2023 4:27 AM GMT
సప్తసాగరాలు దాటి బ్యూటీని పట్టిన రామ్‌..!
X

ఎనర్జిటిక్ స్టార్‌ రామ్‌ ఈ మధ్య కాలంలో కెరీర్‌ పరంగా ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాడు. ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమా తర్వాత ఆ రేంజ్‌ సాలిడ్ విజయం కోసం రామ్‌ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఇటీవలే బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన స్కంద సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా ఫలితం ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

స్కంద సినిమా ఫలితాన్ని పట్టించుకోకుండా రామ్‌ కెరీర్ లో ముందుకు సాగుతూనే ఉన్నాడు. ఇప్పటికే పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో డబుల్‌ ఇస్మార్ట్‌ సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ కార్యక్రమాలు జెట్‌ స్పీడ్‌ తో సాగుతున్నాయి. ఇస్మార్ట్‌ శంకర్‌ కాంబో అవ్వడంతో ప్రేక్షకుల్లో అంచనాలు, ఆసక్తి ఉన్నాయి.

రామ్‌ డబుల్ ఇస్మార్ట్‌ సినిమా విడుదల అవ్వకుండానే మరో సినిమాను కూడా కమిట్‌ అయ్యాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌ లో రామ్‌ హీరోగా ఒక సినిమా రూపొందబోతుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ సినిమాకు దర్శకుడు ఎవరు అనే విషయాన్ని సస్పెన్స్ గా ఉంచుతూ వస్తున్నాయి.

తాజాగా కన్నడ సినిమా సప్తసాగరాలు దాటి తో సెన్షేషనల్‌ స్టార్‌ గా మారిన హీరోయిన్‌ రుక్మిణి వసంత్‌ తో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రతినిధులు చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం అందుతోంది. రామ్‌ సినిమా కోసం ఆమెను సంప్రదించారు అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్‌.

సౌత్‌ లో తెలుగు సినిమా ఇండస్ట్రీకి మంచి డిమాండ్ ఉంది. తెలుగు సినిమా లు పాన్ ఇండియా రేంజ్ లో కూడా ఆడుతున్నాయి. అందుకే హీరోయిన్‌ రుక్మిణి వసంత్ మరో ఆలోచన లేకుండా రామ్‌ కి జోడీగా నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని సమాచారం అందుతోంది. ఈ సినిమా గురించి, హీరోయిన్‌ గురించి త్వరలోనే పీల్స్ మీడియా వారు అధికారికంగా ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.