Begin typing your search above and press return to search.

పుట్ బాల్ దిగ్జజం ఆ స్టార్ హీరోని ప‌ట్టించుకోక‌పోవ‌డ‌మా?

ఇదే మ్యాచ్ కి ఫుట్‌బాల్ ఐకాన్ క్రిస్టియానో రొనాల్డో -అతని భాగస్వామి జార్జినా రోడ్రిగ్జ్ కూడా హాజ‌ర‌య్యారు. అయితే ఈ వెంట్ నుంచి కొన్ని ఫోటోలు నెట్టింట వైర‌ల్ అయ్యాయి.

By:  Tupaki Desk   |   31 Oct 2023 12:54 PM GMT
పుట్ బాల్ దిగ్జజం ఆ స్టార్ హీరోని ప‌ట్టించుకోక‌పోవ‌డ‌మా?
X

ఇటీవ‌ల రియాద్‌లో టైసన్ ఫ్యూరీ - ఫ్రాన్సిస్ నాగన్‌నౌ మధ్య జరిగిన బాక్సింగ్ ఫైట్ ఎంత ఆస‌క్తిక‌రంగా సాగిందో తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ కూడా హాజ‌ర‌య్యారు. ఇరువురు పంచ్ లు విసురుకుంటే భాయ్ కూడా క‌మాన్ అంటూ అంతే వాళ్ల‌ని ప్రోత్స‌హించాడు. అక్క‌డ రింగ్ లో ఫైట్..ఇక్కడ గ్యాల‌రీలో భాయ్ ఉత్సాహం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఇదే మ్యాచ్ కి ఫుట్‌బాల్ ఐకాన్ క్రిస్టియానో రొనాల్డో -అతని భాగస్వామి జార్జినా రోడ్రిగ్జ్ కూడా హాజ‌ర‌య్యారు. అయితే ఈ వెంట్ నుంచి కొన్ని ఫోటోలు నెట్టింట వైర‌ల్ అయ్యాయి. రొనాల్డో జార్జినాతో వేదికపైకి ప్రవేశిం చి నప్పుడు సల్మాన్ ఖాన్‌ను పట్టించుకోలేదని సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్ర‌చారం సాగింది. ఆయ‌న ఇమేజ్ కేవ‌లం బాలీవుడ్ కే ప‌రిమిత‌మ‌ని? క్రీడాకారుల‌కు అత‌ను ఎలా తెలుస్తాడు? అన్న‌ట్లు నెగిటివ్ క‌థ‌నాలు వెత‌ర‌పైకి వ‌చ్చాయి.

దీంతో భాయ్ అభిమానులు అంతే ధీటుగా వాటికి బ‌ధులిచ్చారు. అయితే ఇదంతా అవాస్త‌వాల‌తో కూడిన ప్ర‌చార‌మ‌ని తాజాగా స‌ల్మాన్ అభిమానులు అదే ఈవెంట్ నుంచి మ‌రో ఫోటోతో స‌మాధానం ఇచ్చారు. ముగ్గురు దిగ్గ‌జాలు ఒకే చోటు కూర్చుని రింగ్ లో పంచ్ లు ఆస్వాదించిన‌ట్లు తెలుస్తోంది. రొనాల్డో పక్కన జార్జినా కూర్చోగా.. ఆమె పక్కన సల్మాన్ కూర్చొని కనిపించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు నెట్టింట వైరల్ గా మారాయి.

క్రిస్టియానో రొనాల్డోతో సల్మాన్ కొన్ని క్షణాలు పంచుకున్నట్లు తెలుస్తుంది. దీంతో స‌ల్మాన్ ఖాన్ పై నెట్టింట జ‌రిగిన ప్ర‌చార‌మంతా అవాస్త‌వ‌మ‌ని తెలుస్తుంది. స‌ల్మాన్ పై కావాల‌నే కొంత మంది విష ప్ర‌చారం చేసిన‌ట్లు స‌ల్మాన్ అభిమానులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ప్ర‌స్తుతం సల్మాన్ ఖాన్టై గర్ 3 లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో ఆయ‌న‌కు జోడీగా క‌త్రినా కైఫ్ న‌టిస్తోంది. ఇమ్రాన్ హష్మీ విలన్‌గా, షారుఖ్ ఖాన్ గెస్ట్ రోల్ చేస్తున్నాడు. ఇటీవల ట్రైలర్ తో అంచ‌నాలు ఆకాశ‌న్నంటుతున్నాయి. ఈ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ నవంబర్ 12న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.