Begin typing your search above and press return to search.

ర‌వితేజ తండ్రి మృతి.. చిరంజీవి సంతాపం

టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ త‌న‌ తండ్రి భూపతి రాజగోపాల్ రాజును కోల్పోవడంపై తెలుగు చిత్ర‌సీమ ప్ర‌ముఖులు తీవ్ర విచారం వ్య‌క్తం చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   16 July 2025 9:42 AM IST
ర‌వితేజ తండ్రి మృతి.. చిరంజీవి సంతాపం
X

టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ త‌న‌ తండ్రి భూపతి రాజగోపాల్ రాజును కోల్పోవడంపై తెలుగు చిత్ర‌సీమ ప్ర‌ముఖులు తీవ్ర విచారం వ్య‌క్తం చేస్తున్నారు. ఆయన 90 ఏళ్ల వయసులోవయసు సంబంధిత అనారోగ్య సమస్యలతో ఈ మంగ‌ళ‌వారం రాత్రి మరణించారు. హైదరాబాద్‌లోని స్వ‌గృహంలో ఈ విషాదకరమైన మరణం సంభవించింది.

ర‌వితేజ స్వ‌స్థ‌లం జ‌గ్గంపేట (ఆంధ్ర‌ప్ర‌దేశ్). రాజగోపాల్ రాజు రిటైర్డ్ ఫార్మసిస్ట్. రాజ‌గోపాల్ మరణం కుటుంబాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. ఇది రవితేజకు తీవ్రమైన‌ వ్యక్తిగత లోటు. ఈ క్లిష్ట సమయంలో స‌హ‌చ‌రులు, శ్రేయోభిలాషులు కుటుంబానికి తమ సంతాపాన్ని తెలియజేశారు.

రాజగోపాల్ రాజుకు భార్య రాజ్య లక్ష్మి, కుమారులు రవితేజ, రఘు రాజు ఉన్నారు. మరో కుమారుడు భరత్ రాజు రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే.

అన్న‌య్య చిరంజీవి సంతాపం:

ర‌వితేజ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంద‌ని తెలిసి మెగాస్టార్ చిరంజీవి త‌న ఆవేద‌న‌ను వ్య‌క్తం చేసారు. చిరంజీవి మాట్లాడుతూ.. ``సోదరుడు రవి తేజ తండ్రి రాజ గోపాల్ రాజు గారి మరణవార్త విని చాలా బాధపడ్డాను. ఆయన్ని ఆఖరిసారిగా `వాల్తేర్ వీరయ్య` సెట్లో కలిశాను. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబానికి నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను`` అని అన్నారు.