Begin typing your search above and press return to search.

వామ్మో.. శ్రీవల్లి పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకుందే!

వారిద్దరు ప్రయాణిస్తున్న ఎయిర్‌ విస్తారా విమానంలో సాంకేతిక లోపం తలెత్తైంది. దీంతో ఒక్కసారి విమానం షేక్ అయింది. ఇద్దరు హీరోయిన్లతోపాటు ప్రయాణికులంతా భయానక అనుభవాన్ని ఎదుర్కొన్నారు.

By:  Tupaki Desk   |   18 Feb 2024 6:36 AM GMT
వామ్మో.. శ్రీవల్లి పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకుందే!
X

సాధారణంగా నటీనటులు, సెలబ్రిటీలు తమ జర్నీ టైంను తగ్గించుకునేందుకు విమాన ప్రయాణాన్ని ఎక్కువగా ఎంచుకుంటారు. వారికి ఉన్న షెడ్యూల్స్ తోపాటు ప్రైవసీ కోసం ఫ్లైట్స్ లోనే జర్నీలు చేస్తుంటారు. అయితే అనుకోని ఘటనల వల్ల వారికి అప్పుడప్పుడు చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. తాజాగా నేషనల్ క్రిష్ రష్మిక మందన్న త్రుటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది.

రష్మిక మందన్న ఇటీవల యానిమల్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం పుష్ప-2తోపాటు చేతి నిండా సినిమాలో బిజీ బిజీగా గడుపుతోంది. సౌత్ తో పాటు నార్త్ లో మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. బాలీవుడ్ లో వరుస అవకాశాలు దక్కించుకుంటోంది. ఇటీవలే ఓ సినిమా షూటింగ్ లో పాల్గొనేందుకు ముంబయికి వెళ్లింది రష్మిక.

తాజాగా ముంబయి నుంచి హైదరాబాద్ కు ఓ విమనంలో బయలుదేరింది. ఆ సమయంలో ఆమెతో మరో నటి శ్రద్ధా దాస్ కూడా ఉంది. వారిద్దరు ప్రయాణిస్తున్న ఎయిర్‌ విస్తారా విమానంలో సాంకేతిక లోపం తలెత్తైంది. దీంతో ఒక్కసారి విమానం షేక్ అయింది. ఇద్దరు హీరోయిన్లతోపాటు ప్రయాణికులంతా భయానక అనుభవాన్ని ఎదుర్కొన్నారు. బయలుదేరిన అరగంటలోనే మళ్లీ ఆ విమానం వెనక్కి తిరిగి ముంబయి చేరుకుంది.

అయితే ఈ విషయాన్ని రష్మిక ఇన్‌ స్టాగ్రామ్‌లో ఒక పిక్ షేర్ చేస్తూ పంచుకుంది. "ఈ రోజు మరణం నుంచి తప్పించుకున్నాం" అంటూ కాస్త వ్యంగ్యంగా పోస్ట్ పెట్టింది. దీంతో ఆమె ఫ్యాన్స్ ఏమైందోనని చాలా భయపడ్డారు. అధికారులు ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ప్రకటించడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఇంకొందరైతే థ్యాంక్ గాడ్.. మా బ్యూటీకి ఏం కాలేదంటూ పోస్టులు కూడా పెట్టారు.

యంగ్ హీరో నాగ శౌర్య నటించిన ఛలో చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైంది రష్మిక. ఆ తర్వాత గీతా గోవిందం, డియర్ కామ్రేడ్, భీష్మ, సరిలేరు నీకెవ్వరూ వంటి వరుస సినిమాల్లో నటించి సూపర్ సక్సెస్ లను అందుకుంది. ఇక అల్లు అర్జున్ పుష్పతో నేషనల్ క్రష్ అయిపోయింది ఈ అమ్మడు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. త్వరలోనే శ్రీవల్లిగా పుష్ప-2తో అలరించనుంది.