Begin typing your search above and press return to search.

ఎన‌ర్టిటిక్ స్టార్ తో మాలీవుడ్ మేక‌ర్!

ఈ నేప‌థ్యంలో నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ఏకంగా మాలీవుడ్ డైరెక్ట‌ర్ నే దించేందుకు స‌న్నాహాలుచేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   29 Nov 2023 10:30 AM GMT
ఎన‌ర్టిటిక్ స్టార్ తో మాలీవుడ్ మేక‌ర్!
X

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ కి ఇప్పుడు ఓ హిట్ అవ‌స‌రం. ఇటీవ‌ల రిలీజ్ అయ‌న 'స్కంద' భారీ అంచ‌నాల‌తో రిలీజ్ అయిన వైఫ‌ల్యం ఎదురైంది. దీంతో రామ్ అంచ‌నాల‌న్నీ త‌ల్ల‌కిందుల‌య్యాయి. రామ్ నుంచి ఇది ఏమాత్రం ఊహించ‌న‌ది. దీంతో అభిమానులు తీవ్ర నిరుత్సాహంలో ప‌డ్డారు 'ఇస్మార్ట్ శంక‌ర్' బౌన్స్ బ్యాక్ అయినా దాన్ని కొన‌సాగించ‌లేక‌పోయాడు అన్న విమ‌ర్శ‌లొస్తున్నాయి.

ఇప్పుడు వాట‌న్నింటికి 'డ‌బుల్ ఇస్మార్ట్' తో చెక్ పెట్టాల‌ని చూస్తున్నాడు. అటు పూరి జ‌గ‌న్నాధ్ అండ్ కో కూడా బ్యాడ్ ఫేజ్ లోనే ఉంది. ఇలా స‌క్సెస్ అనివార్య‌మైన జోడీ క‌లిసి ఈ సినిమాకి ప‌ని చేస్తుండ‌టంతో! హిట్ కొడ‌తారు అన్న ధీమా అభిమానుల్లో బ‌లంగా ఉంది. అయినా రామ్ మాత్రం అలెర్ట్ గానే ఉన్నాడు. దీంతో త‌దుప‌రి క‌థలు.. ద‌ర్శ‌కుల విష‌యంలో ఆచితూచి అడుగులు వేస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది.

ఈ నేప‌థ్యంలో నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ఏకంగా మాలీవుడ్ డైరెక్ట‌ర్ నే దించేందుకు స‌న్నాహాలుచేస్తున్న‌ట్లు తెలుస్తోంది. 'దృశ్యం'తో పాన్ ఇండియాలో ఫేమ‌స్ అయిన జీతూ జోసెఫ్ తో రామ్ ఓ సినిమా చేసేలా ఒప్పందం చేసుకున్న‌ట్లు వినిపిస్తుంది. చాలా కాలంగా ఇద్ద‌రి మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ట‌. అవ‌న్నీ ఓ కొలిక్కి రావ‌డంతో సినిమా చేద్దామ‌ని నిర్ణ‌యించుకున్నారుట‌.

ఈ సినిమా ని జీతు జోసెఫ్ త‌న‌లో కొత్త స్టైల్ ని ప‌రిచ‌యం చేయ‌బోతున్నాడు. 'దృశ్యం' చిత్రాల‌కు భిన్నంగా ఓ భారీ యాక్షన్ క‌థ‌ని సిద్దం చేస్తున్నారుట‌. ఇప్ప‌టికే స్టోరీ లాక్ అయిందిట‌. కానీ అవ‌స‌ర‌మైన మార్పులు ఉండ‌టంతో వాటికి క‌థకి తుది మెరుగులు దిద్దుతున్న‌ట్లు వినిపిస్తుంది. అలాగే ఈ సినిమాని రెండు భాగాలు రిలీజ్ చేయ‌నున్నారుట‌. అతి త్వ‌ర‌లోనే షూటింగ్ మొద‌లు పెట్టి...తొలి భాగాన్ని వ‌చ్చే ఏడాది మిడ్ లోనే రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారుట‌.