Begin typing your search above and press return to search.

ఏనుగుకి స్నానం చేయించిన క్లిన్ కారా

ఒక చంటి ఏనుగు పిల్ల‌కు స్నానం చేయిస్తుంటే ఇంకో చంటి పిల్ల చూడ‌టం బావుంది.. ఇది వెరీ ఫ‌న్నీ..! కానీ ఇది నిజం!!

By:  Tupaki Desk   |   7 April 2024 11:04 AM GMT
ఏనుగుకి స్నానం చేయించిన క్లిన్ కారా
X

ఏనుగు పిల్ల‌కు స్నానం చేయిస్తుంటే క్లిన్ కారా ఎలా చూస్తోందో చూశారు క‌దా! కొణిదెల వారి అమ్మాయా మ‌జాకానా! చాలా గ‌మ్మ‌త్త‌యిన దృశ్య‌మిది. ఒక చంటి ఏనుగు పిల్ల‌కు స్నానం చేయిస్తుంటే ఇంకో చంటి పిల్ల చూడ‌టం బావుంది.. ఇది వెరీ ఫ‌న్నీ..! కానీ ఇది నిజం!!


రామ్ చరణ్, ఉపాసన కూతురు క్లిన్ కారాతో కలిసి సముయ్‌లోని ఏనుగు రెస్క్యూ క్యాంపును సందర్శించారు. వీరంతా ఇప్పుడు థాయ్‌లాండ్‌లోని కో సముయ్‌లో విహారయాత్రలో ఉన్నారు. ఈ జంట వారి కుమార్తె క్లిన్ కారా... పెట్ డాగ్ రైమ్‌తో కలిసి విహార‌యాత్ర‌లో ఉన్నారు. ఇన్ స్టాలో యాత్ర‌కు సంబంధించిన ఫోటోలను ఉపాస‌న చ‌ర‌ణ్ షేర్ చేసారు. ఒక ఫోటోలో కుక్కపిల్ల సముద్రంలో ఈత కొట్టడం క‌నిపిస్తుంది. ఒక ఫోటోలో పానీయంతో టేబుల్‌పై పోజులివ్వడం క‌నిపించింది. ఒక ఫోటోలో ఏనుగు రెస్క్యూ క్యాంప్‌లో రామ్ చ‌ర‌ణ్‌, ఉపాసన, క్లిన్ .. క‌లిసి పిల్ల ఏనుగుకు స్నానం చేయిస్తూ క‌నిపించారు.

పెట్ డాగ్ రైమ్ సోష‌ల్ మీడియా ఖాతాలో ఇలా రాసి ఉంది. ``ధ‌న్యవాదాలు నానా, నా సోదరి క్లిన్ కారాతో స్యామ్యూయ్‌లో చల్లటి ప్రకంపనలను ఆస్వాధించాను. సముద్రంలో ఈత కొట్టడం .. రెస్క్యూ క్యాంప్‌లో ఏనుగుల రక్షణ గురించి తెలుసుకోవడం చాలా ఇష్టం. అద్భుతమైన సంరక్షణ & నా కొత్త థాయ్ కట్ కోసం పుయ్ - గెట్టి(బార్బ‌ర్స్) కి చాలా ధన్యవాదాలు!`` అని రాసి ఉంది. గత వారం, వారు రైమ్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి వారి స్నేహితులతో క‌లిసి ఉన్న ఒక ఫోటోని షేర్ చేసారు. తమ ఈస్టర్ ఆదివారం ఎలా గడిపారో ఈ పోస్ట‌ర్ లో కనిపించింది. వారంతా చార్టర్డ్ ఫ్లైట్‌లో ఉన్నప్ప‌టి ఫోటో అది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. శంకర్‌తో గేమ్ ఛేంజర్ కొత్త షెడ్యూల్ షూటింగ్ లో చ‌ర‌ణ్ పాల్గొనాల్సి ఉంది. ఈ చిత్రంలో కియారా అద్వానీ, ఎస్‌జె సూర్య, అంజలి, జయరామ్, సునీల్, నవీన్ చంద్ర మరియు సముద్రఖని తదిత‌రులు న‌టిస్తున్నారు. మేకర్స్ ఇటీవల ఈ చిత్రం నుండి జరగండి అనే మొదటి సింగిల్‌ను విడుదల చేసారు. దీనికి మిశ్రమ స్పందన వచ్చింది. ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సనాతో విలేజ్ నేప‌థ్యంలో స్పోర్స్ డ్రామాలోను చ‌ర‌ణ్ న‌టిస్తున్నారు. ఇటీవ‌లే ఈ సినిమా అధికారికంగా ప్రారంభం అయింది. క‌న్న‌డ న‌టుడు శివ రాజ్‌కుమార్ ఇందులో కీల‌క పాత్ర‌ధారి. జాన్వీ కపూర్ ఇందులో క‌థానాయిక‌. 2018లో విడుదలైన రంగస్థలం తర్వాత సుకుమార్‌తో రెండో సినిమాలో రామ్ చ‌ర‌ణ్ నటించనున్నాడు. ఇటీవ‌లే అధికారికంగా ఈ సినిమాని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.