Begin typing your search above and press return to search.

మాతృమూర్తికి చ‌ర‌ణ్ అద్భుత‌మైన కానుక‌

తల్లీ కొడుకుల ప్రేమానుబంధాన్ని రామ్ చరణ్ భార్య ఉపాసన క్యాప్చర్ చేయ‌డం ఆస‌క్తిక‌రం. ఇక అత్తమ్మ‌తో ఉపాస‌న అనుబంధం అంతే గొప్ప‌ద‌ని ఈ రీల్ నిరూపిస్తోంది.

By:  Tupaki Desk   |   9 March 2024 4:58 AM GMT
మాతృమూర్తికి చ‌ర‌ణ్ అద్భుత‌మైన కానుక‌
X

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పుర‌స్క‌రించుకుని మ‌హిళామ‌ణుల‌కు యువ‌త‌రం నుంచి స్ఫూర్తిదాయ‌క సందేశాలు వెల్లువెత్తాయి. ఇదే రోజు అంటే.. 8 మార్చి 2024న మహా శివరాత్రిని ప్రగాఢ భక్తి శ్ర‌ద్ధ‌ల‌తో ఉప‌వాస ధీక్ష‌ను పాటించి ఆ స‌ర్వేశ్వ‌రుని అనుగ్ర‌హాన్ని భ‌క్తులు పొందారు. నిజానికి మ‌హిళాదినోత్స‌వం వేళ‌ సెలబ్రిటీలు తమ జీవితాల్లో మహిళలపై తమ అభిమానాన్ని, కృతజ్ఞతా భావాన్ని వ్యక్తం చేయడంలో వెనుకంజ వేయలేదు.

మెగా హీరో రామ్ చరణ్ మ‌హాశివ‌రాత్రి రోజు(మ‌హిళా దినోత్స‌వం కూడా) సంతోషకరమైన సందర్భంలో తన తల్లి సురేఖకు తన ప్రేమ పూర్వ‌క‌మైన కానుక‌లు అందించారు. నిజంగా చ‌ర‌ణ్‌ ప్రత్యేక రీతిలో త‌న మాతృమూర్తి ఆశ్చర్యపడేలా చేసాడు. శివ‌రాత్రి లో రామ్ చరణ్ వంటగది బాధ్యతలను తీసుకున్నాడు. నోరూరించే రుచికరమైన వంటకాలను తయారు చేసాడు. అత‌డు తన పాక శాస్త్ర‌ నైపుణ్యాలను ప్రదర్శించాడు. ప్రేమతో నిండిన హృదయంతో రుచికరమైన దోసెలు పన్నీర్ టిక్కాను రూపొందించాడు. చ‌ర‌ణ్ షేర్ చేసిన అరుదైన వీడియో, ఫోటోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వేగంగా వైర‌ల్ అయ్యాయి.

త‌న‌ తల్లిగారైన‌ సురేఖతో కుమారుని ఆప్యాయత, ప్రేమానుబంధం అభిమానుల హృదయాలను దోచుకుంది. సురేఖ తన కొడుకు చెఫ్ టోపీని ధరించడం చూసి చాలా ఆనందించ‌డం ఇందులో కనిపిస్తోంది. తల్లీ కొడుకుల ప్రేమానుబంధాన్ని రామ్ చరణ్ భార్య ఉపాసన క్యాప్చర్ చేయ‌డం ఆస‌క్తిక‌రం. ఇక అత్తమ్మ‌తో ఉపాస‌న అనుబంధం అంతే గొప్ప‌ద‌ని ఈ రీల్ నిరూపిస్తోంది. ఉపాస‌న అంద‌మైన‌ రీల్‌ను షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఉపాస‌న‌ తన అత్తగారు సురేఖతో కలిసి అత్తమ్మ కిచెన్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. శుక్ర‌వారం నాడు తన పోస్ట్‌లో ''ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మా అత్తగారు తన 60 ఏళ్ల వ‌య‌సులో పారిశ్రామికవేత్తగా అరంగేట్రం చేస్తున్నారు. ఇంతకు మించి ఉంటే మన దేశం ఎంత సంపన్నంగా ఉంటుందో ఊహించుకోండి. ఆత్మలు & అమ్మలు వ్యవస్థాపకులుగా మారారు!! ఎక్కువ మంది మహిళలు వర్క్‌ఫోర్స్‌లో చేరడం & వారి అభిరుచిని అనుసరించడాన్ని సెల‌బ్రేట్ చేసుకుందాం'' అని అన్నారు.

ఈ అంద‌మైన ఫ్యామిలీ బాండింగ్ అంద‌రికీ స్ఫూర్తి. రామ్ చరణ్ తన వృత్తిపరమైన కమిట్‌మెంట్‌లతో తన వ్యక్తిగత అంశాలను సమతుల్యం చేసుకుంటూ అంకితభావంతో ప‌ని చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రఖ్యాత చిత్రనిర్మాత శంకర్ దర్శకత్వంలో గ్రిప్పింగ్ పొలిటికల్ థ్రిల్లర్ 'గేమ్ ఛేంజర్' చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. రామ్ చరణ్ ద్విపాత్రాభినయం ఈ చిత్రంలో ప్రేక్షకులను కట్టిపడేస్తుందని చెబుతున్నారు. సహ తార‌లు కియారా అద్వానీ, అంజలితో చ‌రణ్‌ ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ, థమన్ మెస్మరైజింగ్ ట్యూన్‌లు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలువ‌నున్నాయి.

చ‌ర‌ణ్ త‌దుప‌రి దర్శకుడు బుచ్చి బాబు సాన తెర‌కెక్కించే సినిమాని కూడా ప్రారంభిస్తున్నారు. అతిలోక సుంద‌రి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ఇందులో క‌థానాయిక‌. రంగస్థలం తరహాలో నిజ జీవితంలోని సంఘటనల నుండి ప్రేరణ పొంది బుచ్చిబాబు ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారని తెలుస్తోంది.