Begin typing your search above and press return to search.

రెస్టారెంట్ బిజినెస్‌లో ర‌కుల్ పెట్టుబ‌డులు

ఇంత‌కుముందు ఎఫ్ 45 పేరుతో జిమ్ ల వ్యాపారంలోకి దిగిన ర‌కుల్ ప్రీత్ మెట్రో న‌గ‌రాల్లో జిమ్‌ల‌ను విస్త‌రించి విజయ‌వంతంగా నిర్వ‌హిస్తోంది.

By:  Tupaki Desk   |   11 April 2024 3:00 AM GMT
రెస్టారెంట్ బిజినెస్‌లో ర‌కుల్ పెట్టుబ‌డులు
X

సౌత్‌లో అగ్ర క‌థానాయిక‌గా ఓ వెలుగు వెలిగిన‌ రకుల్ ప్రీత్ సింగ్ ఎంట‌ర్ ప్రెన్యూర్ గాను దూసుకుపోతోంది. ఇత‌రుల‌తో పోలిస్తే, దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌దిద్దుకున్న తెలివైన క‌థానాయిక‌గా ర‌కుల్ కి ఇప్ప‌టికే గుర్తింపు ఉంది. ఇంత‌కుముందు ఎఫ్ 45 పేరుతో జిమ్ ల వ్యాపారంలోకి దిగిన ర‌కుల్ ప్రీత్ మెట్రో న‌గ‌రాల్లో జిమ్‌ల‌ను విస్త‌రించి విజయ‌వంతంగా నిర్వ‌హిస్తోంది.

ఇప్పుడు తన మొదటి డైన్-ఇన్ రెస్టారెంట్‌ను ప్రారంభించి ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఆరంభం- మిల్లెట్ పేరుతో ఏప్రిల్ 16న హైదరాబాద్‌ మాదాపూర్‌లో ఈ రెస్టారెంట్ ప్రారంభం కానుంది. భారతదేశంలోని ప్రముఖ F&B క్లౌడ్ కిచెన్ ఆపరేటర్ సహకారంతో ఈ రెస్టారెంట్ ప్రారంభించనుంది. ఆరంభం - మిల్లెట్‌తో మొదలవుతుంది అనేది ట్యాగ్ లైన్. ధాన్యం పోషక విలువల ఆధారంగా ప్రత్యేకమైన డైన్-ఇన్ కాన్సెప్ట్ మిల్లెట్-సెంట్రిక్ మెనూని ఈ రెస్టారెంట్ అందిస్తుంది. రకుల్ ప్రీత్ సింగ్, స్వయంగా ఫిట్‌నెస్ ఔత్సాహికురాలు, ఆరోగ్యకరమైన ఆహార పద్ధతులు, ప్ర‌జ‌ల‌ శ్రేయస్సును పెంపొందించడం కోసం రెస్టారెంట్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా వ్యవహరిస్తారు.

హైదరాబాద్‌లో నా మొదటి రెస్టారెంట్‌ను ప్రారంభించడం ఆనందంగా ఉంది. అందరికీ రుచికరమైన, పోషకాహారాన్ని అందించాల‌నే ల‌క్ష్య‌మిది. ఆహారం శరీరానికి మాత్రమే కాకుండా ఆత్మకు కూడా అవ‌స‌ర‌మ‌ని నేను నమ్ముతున్నాను. ఆరంభంలో మేము దీన్ని అందించ‌డానికి ప్లాన్ చేస్తున్నాము.. ఒకేసారి ఒక పోషకాల‌తో మిల్లెట్ గిన్నె అందిస్తాం అని అంది. ఈ త‌ర‌హా రెస్టారెంట్ ల‌ను విస్త‌రించే ఆలోచ‌న ఉంద‌ని కూడా తెలిపింది. ర‌కుల్ న‌టిస్తున్న భార‌తీయుడు 2 విడుద‌ల కావాల్సి ఉంది.