Begin typing your search above and press return to search.

ఫ్లాష్ బ్యాక్ : రకుల్ తండ్రి కి పూరి కి మధ్య 'దేశముదురు'!

ఒకానొక సమయంలో స్టార్‌ హీరోల సినిమాలకు కూడా డేట్లు లేవు అని నో చెప్పిన రకుల్‌ ఇప్పుడు మళ్లీ ఆఫర్ల కోసం వెయిట్‌ చేస్తూ ఉంది.

By:  Tupaki Desk   |   16 April 2024 4:30 PM GMT
ఫ్లాష్ బ్యాక్ : రకుల్ తండ్రి కి పూరి కి మధ్య దేశముదురు!
X

టాలీవుడ్ తో పాటు కోలీవుడ్‌, బాలీవుడ్ లో కూడా పలు సినిమాల్లో నటించి స్టార్‌ హీరోయిన్‌ క్రేజ్ ను, స్టార్‌ డమ్‌ ను దక్కించుకున్న ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. ఒకానొక సమయంలో స్టార్‌ హీరోల సినిమాలకు కూడా డేట్లు లేవు అని నో చెప్పిన రకుల్‌ ఇప్పుడు మళ్లీ ఆఫర్ల కోసం వెయిట్‌ చేస్తూ ఉంది.

ఆ విషయం పక్కన పెడితే తాజాగా రకుల్‌ ప్రీత్‌ సింగ్ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా వచ్చిన దేశ ముదురు సినిమాకు గాను మొదట హీరోయిన్‌ గా నన్ను అనుకున్నారు, మా నాన్న తో పూరి గారు మాట్లాడారు అంది.

ఇంకా రకుల్‌ మాట్లాడుతూ... పూరి సర్‌ పోకిరి సినిమా తర్వాత అల్లు అర్జున్ తో దేశ ముదురు సినిమా ను చేసేందుకు సిద్ధం అయిన సమయంలో నన్ను ఒకానొక సందర్భంగా చూశారట. ఆ సినిమాలో నన్ను హీరోయిన్ గా ఆయన అనుకున్నారు.

దేశ ముదురు సినిమాలో రకుల్‌ ను తీసుకోవాలి అనుకుంటున్నాం అంటూ స్వయంగా నాన్న వద్ద ప్రపోజల్‌ పెట్టారు. కానీ నాన్న ప్రస్తుతం పరీక్షలు రాస్తుందని, అంతే కాకుండా తెలుగు రాదు కనుక కాస్త ఇబ్బంది అన్నట్లుగా చెప్పి సినిమా ను తిరస్కరించారు.

అప్పుడు నాన్నతో పూరి సర్ డైరెక్ట్‌ గా మాట్లాడారు. నాన్న పై పూరి గారు సీరియస్‌ అయ్యారు. డిగ్రీ పరీక్షలు ఇవ్వాల కాకుంటే తర్వాత రాసుకోవచ్చు. కానీ ఇలాంటి ఆఫర్‌ చేజారితే మళ్లీ దక్కదు. డిగ్రీ పాస్ అయ్యి ఆ పట్టాను మెడలో వేసుకుని నీ కూతురు తిరుగుతుందా అని నాన్న పై పూరి గారు మండి పడ్డారు. అయినా కూడా నాన్న మాత్రం దేశ ముదురు సినిమా చేసేందుకు ఒప్పుకోలేదు అంటూ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ చెప్పుకొచ్చింది.