Begin typing your search above and press return to search.

దైవ దర్శనంలో కొత్త జంట పిక్ వైరల్‌

ఈసారి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తన భర్త జాకీ భగ్నానీ తో కలిసి అత్యంత ప్రాచీనమైన కామాఖ్య దేవాలయం లో కొలువై ఉన్న కామాఖ్య దేవి అమ్మవారిని దర్శించుకుంది.

By:  Tupaki Desk   |   7 March 2024 9:41 AM GMT
దైవ దర్శనంలో కొత్త జంట పిక్ వైరల్‌
X

టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో ఎన్నో భారీ చిత్రాల్లో నటించి పాన్‌ ఇండియా స్టార్‌ డమ్ దక్కించుకున్న ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. ఈ మధ్య కాలంలో బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్ ఇలా అన్ని చోట్ల కూడా ఆఫర్లు తగ్గడంతో వైవాహిక జీవితంలో అడుగు పెట్టింది.

గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న జాకీ భగ్నానీ తో ఈ అమ్మడు ఏడు అడుగులు వేసింది. గోవాలో వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ వైభవంగా జరిగింది. వీరి పెళ్లి ఫోటోలు, పెళ్లికి ముందు జరిగిన తంతు ఇలా అన్నీ కూడా ఫోటోలు వీడియోల రూపంలో నెట్టింట తెగ సందడి చేశాయి.

పెళ్లి తర్వాత కూడా ఈ కొత్త జంట ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. ఈసారి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తన భర్త జాకీ భగ్నానీ తో కలిసి అత్యంత ప్రాచీనమైన కామాఖ్య దేవాలయం లో కొలువై ఉన్న కామాఖ్య దేవి అమ్మవారిని దర్శించుకుంది. కొత్త జంటతో పాటు కుటుంబ సభ్యులు మరియు మిత్రులు కూడా ఉన్నారు.

కామాఖ్యదేవి ఆలయ సందర్శనకి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. ఇక ఈ అమ్మడి సినిమాల విషయానికి వస్తే పెళ్లి తర్వాత కూడా తన కెరీర్‌ ను కొనసాగిస్తాను అంది. అంతే కాకుండా ఇక ముందు ఈ అమ్మడు వెబ్‌ సిరీస్‌ ల్లో కూడా నటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.