ధగధగా మెరిసిపోతున్న రకుల్.. వ్వాటే లుక్!
సిల్వర్ క్రిస్టల్ వర్క్ ఉన్న బ్లాక్ కలర్ డిజైనర్ డ్రెస్లో ఎంతో గ్లామరస్గా కనిపించింది. స్లీక్ హెయిర్స్టైల్, మినిమల్ యాక్సెసరీస్తో తన లుక్ను హైలెట్ చేసింది.
By: Tupaki Desk | 18 Oct 2025 8:00 AM ISTటాలీవుడ్, బాలీవుడ్లలో స్టార్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకుంది రకుల్ ప్రీత్ సింగ్. నటనతోనే కాకుండా, తన ఫ్యాషన్ సెన్స్, ఫిట్నెస్తో ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంటుంది. తాజాగా ఓ అవార్డుల వేడుకలో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రముఖ మ్యాగజైన్ నిర్వహించిన ఈవెంట్లో రకుల్ స్టైలిష్ లుక్లో ధగధగా మెరిసిపోయింది.
సిల్వర్ క్రిస్టల్ వర్క్ ఉన్న బ్లాక్ కలర్ డిజైనర్ డ్రెస్లో ఎంతో గ్లామరస్గా కనిపించింది. స్లీక్ హెయిర్స్టైల్, మినిమల్ యాక్సెసరీస్తో తన లుక్ను హైలెట్ చేసింది. ఈ వేడుకలో ఆమె "ఎల్లే ప్యూర్ ప్రజెన్స్" అవార్డును కూడా అందుకుంది.
కెరీర్ ప్రారంభంలో టాలీవుడ్లో వరుస విజయాలతో టాప్ హీరోయిన్గా ఎదిగింది రకుల్. 'వెంకటాద్రి ఎక్స్ప్రెస్', 'నాన్నకు ప్రేమతో', 'సరైనోడు' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.
ఆ తర్వాత బాలీవుడ్పై ఫోకస్ పెట్టి, అక్కడ కూడా సక్సెస్ఫుల్ హీరోయిన్గా నిలదొక్కుకుంది. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ దక్షిణాది, ఉత్తరాది భాషల్లో పలు క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. కమల్ హాసన్ నటిస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ 'ఇండియన్ 3'లో కీలక పాత్ర పోషిస్తోంది. దీంతో పాటు మరికొన్ని హిందీ సినిమాలకు కూడా సైన్ చేసింది. ఒకవైపు సినిమాలు, మరోవైపు బిజినెస్లతో రకుల్ తన కెరీర్ను పక్కాగా ప్లాన్ చేసుకుంటోంది.
నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూనే, గ్లామర్లోనూ ఏమాత్రం తగ్గకుండా ఫ్యాన్స్ను అలరిస్తూ కెరీర్లో ముందుకు సాగుతోంది. అలాగే హిందీలో హిట్టయిన దేదే ప్యార్ దే సీక్వెల్ తో పాటు పతి పత్నీ ఔర్ వో పార్ట్ 2లో కూడా నటిస్తోంది. సక్సెస్ రేటు గతంలో కంటే కాస్త తగ్గినా కూడా మార్కెట్ లో తన క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఇక రాబోయే సినిమాలు అమ్మడికి ఎలాంటి ఫలితాన్ని అందిస్తాయో చూడాలి.
