Begin typing your search above and press return to search.

జక్కన్న.. వాళ్లనెందుకు పక్కన పెట్టారో?

టాలీవుడ్‌ లో ఎంతో కాలంగా వేచి చూస్తున్న కాంబినేషన్లు ఇప్పుడిప్పుడే వర్కౌట్ అవుతున్నాయి

By:  Tupaki Desk   |   5 Feb 2024 12:31 PM GMT
జక్కన్న.. వాళ్లనెందుకు పక్కన పెట్టారో?
X

టాలీవుడ్‌ లో ఎంతో కాలంగా వేచి చూస్తున్న కాంబినేషన్లు ఇప్పుడిప్పుడే వర్కౌట్ అవుతున్నాయి. అందులో సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కలిసి చేస్తున్న ప్రాజెక్టు ఒకటి. వీళ్లిద్దరు కలిసి చాలా కాలం క్రితమే సినిమా చేయాలని అనుకుంటున్నారు. కానీ అప్పుడు వర్కౌట్ కాలేదు. ఇక త్వరలోనే వీళ్ల ప్రాజెక్టు పట్టాలెక్కబోతుంది.

ఎంతో ప్రతిష్ఠాత్మకమైన కాంబినేషన్ కావడంతో ఈ ప్రాజెక్టుపై అప్పుడే ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లే ఈ సినిమా స్టోరీని రెడీ చేసినట్లు తెలిసింది. దీని బాధ్యతను తన తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ కు జక్కన్న అప్పగించడంతో ఆయన చాలా రోజులు ఈ మూవీ కథపై వర్క్ చేశారు. ఇటీవలే స్క్రిప్టును పూర్తి చేసినట్లు ఆయనే స్వయంగా తెలిపారు.

సాధారణంగా రాజమౌళి తెరకెక్కించే సినిమాల్లో తన ముందు చిత్రాల టీమ్ యే ఉంటుంది. కానీ జక్కన్న.. మహేశ్ మూవీ కోసం తన టీమ్ లో చాలా మార్పులు చేస్తున్నారని తెలిసింది. రాజమౌళి చాలా మూవీలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన సెంథిల్ కుమార్ స్థానంలో ఇప్పుడు పీఎస్ వినోద్ ను తీసుకోనున్నారట. వీఎఫ్ ఎక్స్ సూపర్వైజర్ శ్రీనివాస్ మోహన్ ను కమల్ కన్నన్ తో భర్తీ చేయనున్నారట.

ఇంకా స్టార్ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ ను కూడా పక్కనపెడుతున్నారట. కానీ ఎంఎం కీరవాణి మాత్రం ఈ ప్రాజెక్ట్ లో భాగమవ్వనున్నారట. ఆయనే ఈ మూవీకి సంగీతాన్ని అందించనున్నారట. అయితే రాజమౌళి తీసుకున్న ఈ నిర్ణయాలకు కారణమేంటోనని సినీ వర్గాల్లో తెగ మాట్లాడుకుంటున్నారు.

ఆఫ్రికా బ్యాక్‌ డ్రాప్‌ లో అడ్వెంచర్ థ్రిల్లర్‌ గా అత్యంత భారీ బడ్జెట్‌ తో తెరకెక్కనున్న ఈ సినిమాలో మహేశ్ బాబుతో పాటు మరో స్టార్ హీరో నటిస్తున్నట్లు చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఆ హీరో కింగ్ అక్కినేని నాగార్జునేని తెలుస్తోంది. హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ నటి ప్రియాంక చోప్రా యాక్ట్ చేయనున్నట్లు సమాచారం. మరి ఈ మూవీ కాస్ట్ విషయంలో అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.