Begin typing your search above and press return to search.

జక్కన్నతో సెంథిల్.. ఎందుకు చేయడం లేదంటే..

అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాకి మాత్రం జక్కన్న ఇంకో సినిమాటోగ్రాఫర్ ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. పిఎస్ వినోద్ ని ఆయన కన్ఫర్మ్ చేసారంట.

By:  Tupaki Desk   |   7 Nov 2023 4:23 AM GMT
జక్కన్నతో సెంథిల్.. ఎందుకు చేయడం లేదంటే..
X

దర్శక దిగ్గజం రాజమౌళి నెక్స్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ డెవలప్మెంట్ జరుగుతోంది. అది పూర్తయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారనేది క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం మూవీ చేస్తున్నారు. ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత పూర్తిగా జక్కన్న ప్రాజెక్ట్ పై ఫోకస్ చేయనున్నారు.

రాజమౌళి సినిమా అంటే కచ్చితంగా సినిమాటోగ్రాఫర్ గా సెంథిల్ కుమార్ ఉంటారు. బాహుబలి సిరీస్, ఆర్ఆర్ఆర్ సినిమాలకి ఆయనే వర్క్ చేశారు. రాజమౌళి సినిమాలతోనే సెంథిల్ స్టార్ సినిమాటోగ్రాఫర్ గా మారారు కూడా. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాకి మాత్రం జక్కన్న ఇంకో సినిమాటోగ్రాఫర్ ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. పిఎస్ వినోద్ ని ఆయన కన్ఫర్మ్ చేసారంట.

పంజా, ధృవ, అల వైకుంఠపురంలో, అరవింద సమేత సినిమాలకి పిఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేశారు. ఇప్పుడు జక్కన్నతో సినిమా చేసే అవకాశాన్ని సొంతం చేసుకున్నారు. సూపర్ స్టార్ తో చేయబోయే మూవీ పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కనుంది. కచ్చితంగా ఆర్ఆర్ఆర్ ని మించి హాలీవుడ్ స్టాండర్డ్స్ లోనే జక్కన్న ఈ చిత్రాన్ని సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించబోతున్నారు.

అంటే కచ్చితంగా పిఎస్ వినోద్ ని కచ్చితంగా ఈ మూవీ స్టార్ సినిమాటోగ్రాఫర్ గా మార్చేసే అవకాశం కనిపిస్తోంది. రెగ్యులర్ గా జక్కన్నతో చేసే సెంథిల్ కుమార్ డైరెక్టర్ గా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కారణంగానే ఆయన తప్పుకోవడంతో జక్కన్న సెకండ్ ఛాయస్ గా పిఎస్ వినోద్ ని ఎంపిక చేశారు. ప్రస్తుతం ఇతను గుంటూరు కారం సినిమాకి వర్క్ చేస్తున్నారు.

పిఎస్ వినోద్, త్రివిక్రమ్ ఫేవరేట్ కెమెరామెన్ గా ఉన్నారు. ఆయన సినిమాలకి వరుసగా చేస్తున్నారు. గుంటూరు కారం కూడా ముందు వేరొక సినిమాటోగ్రాఫర్ తో చేసిన మళ్ళీ చేంజ్ చేసి పిఎస్ వినోద్ ని త్రివిక్రమ్ ఖరారు చేశారు. జక్కన్నతో పిఎస్ వినోద్ జర్నీ ఎలా ఉండబోతోందనేది SSMB 29 తో తేలిపోనుంది.