ట్రెండీ టాక్: సీనియర్ నటికి కన్నకూతురి కంటే ఎక్కువ!
ముఖ్యంగా సవతి కుమార్తె (శరత్ కుమార్ మొదటి భార్య ఛాయాదేవి కుమార్తె వరలక్ష్మి) అయినా కానీ, రాధిక శరత్ కుమార్ అండదండలు ఆశ్చర్యపరుస్తున్నాయి.
By: Sivaji Kontham | 1 March 2026 8:00 PM IST`సరస్వతి` (35 చిన్న కథ కాదు) చిత్రానికి దర్శకత్వం వహించిన వరలక్ష్మి శరత్ కుమార్ ఇటీవల తన సినిమా ప్రమోషన్స్ తో తెలుగు మీడియాలో ప్రధానంగా కనిపిస్తోంది. అయితే వరలక్ష్మి దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రమోషన్స్ కోసం రాధిక శరత్ కుమార్ సహకారం అందిస్తున్న తీరు సర్వత్రా చర్చగా మారింది. వారి మధ్య అన్యోన్యత, సఖ్యత అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా సవతి కుమార్తె (శరత్ కుమార్ మొదటి భార్య ఛాయాదేవి కుమార్తె వరలక్ష్మి) అయినా కానీ, రాధిక శరత్ కుమార్ అండదండలు ఆశ్చర్యపరుస్తున్నాయి.
నిజానికి వరలక్ష్మి శరత్ కుమార్ వివాహం ముంబైకి చెందిన నికోలయ్ సచ్దేవ్తో ఘనంగా జరిగింది. ఈ వేడుకను రాధిక దగ్గరుండి పర్యవేక్షించారు. వరలక్ష్మి సినిమాల్లోకి రావడం ఆమె తండ్రి శరత్ కుమార్కు మొదట్లో అస్సలు ఇష్టం లేదు. వరలక్ష్మి నటించకూడదని, గ్లామర్ రంగం వద్దని శరత్ కుమార్ గట్టిగా నివారించేవారు. ఆయన నిర్మాతలను కూడా అవకాశాలివ్వొద్దని బెదిరించారని రాధిక ఓ సరదా ఇంటర్వ్యూలో తెలిపారు.
అయితే వరలక్ష్మికి నటనపై ఉన్న మక్కువను చూసి చివరకు రాధికే స్వయంగా శరత్ కుమార్ను ఒప్పించి ఆమెను ప్రోత్సహించారు. రాధిక జోక్యంతోనే వరలక్ష్మి సినీ రంగంలోకి అడుగుపెట్టగలిగింది. తన సవతి కుమార్తె అయినప్పటికీ వరలక్ష్మితో రాధికకు ఉన్న మంచి అనుబంధం ఇప్పుడు చర్చగా మారింది.
తమ మధ్య స్నేహపూర్వక బంధం ఉంటుందని రాధిక తెలిపారు. శరత్ కుమార్ మొదటి భార్య ఛాయాదేవి కూడా రాధిక పట్ల గౌరవంగా ఉంటారు. వరలక్ష్మి ప్రస్తుతం సౌత్ ఇండియాలో ఒక పవర్ఫుల్ నటిగా గుర్తింపు తెచ్చుకోవడం పట్ల రాధిక గర్వపడుతున్నారు.
నివేదా థామస్, విశ్వదేవ్ రాచకొండ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం `సరస్వతి- 35 చిన్న కథ కాదు` సినిమాలో సరస్వతి పాత్ర కీలకం. ఈ పాత్రలో నివేధ థామస్ నటించారు. ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా యాంకర్ సుమతో కలిసి చిత్ర యూనిట్ ఎంతో సందడి చేసింది. దర్శకుడు నంద కిషోర్ ఈ కథను చాలా సహజంగా, మధ్యతరగతి కుటుంబ నేపథ్యంలో ఈ కథను రాసుకున్నట్లు తెలిపారు. విశ్వదేవ్ రాచకొండ ఈ సినిమాలో నివేదాకు భర్తగా నటించారు. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఫన్నీగా ఉంటాయని ఇంటర్వ్యూలో వెల్లడించారు. రానా దగ్గుబాటి ఈ చిత్రానికి సమర్పకుడిగా ఉండటం సినిమాపై అంచనాలను పెంచిందని చిత్ర యూనిట్ పేర్కొంది. మార్చి 6 న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.
