Begin typing your search above and press return to search.

డబుల్ ఇస్మార్ట్ తర్వాత పూరీ ప్రయోగం..!

లైగర్ ఇచ్చిన షాక్ తో పూరీ జగన్నాథ్ తో సినిమా అంటే హీరోలంతా కూడా వెనకడుగు వేస్తున్నారు.

By:  Tupaki Desk   |   8 Jan 2024 3:30 AM GMT
డబుల్ ఇస్మార్ట్ తర్వాత పూరీ ప్రయోగం..!
X

లైగర్ ఇచ్చిన షాక్ తో పూరీ జగన్నాథ్ తో సినిమా అంటే హీరోలంతా కూడా వెనకడుగు వేస్తున్నారు. అయితే రామ్ కి ఇస్మార్ట్ శంకర్ తో హిట్ ఇచ్చిన కారణంగా ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా నేనున్నా అంటూ రామ్ మరో ఛాన్స్ ఇచ్చాడు. ప్రస్తుతం ఇద్దరు కలిసి డబుల్ ఇస్మార్ట్ సినిమా చేస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో డబుల్ ఇస్మార్ట్ సినిమాను సిద్ధం చేస్తున్నారు. రామ్ తో కలిసి మరోసారి బ్లాక్ బస్టర్ టార్గెట్ పెట్టుకున్నాడు పూరీ జగన్నాథ్.

డబుల్ ఇస్మార్ట్ తర్వాత పూరీ ప్లానింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉందని తెలుస్తుంది. లైగర్ హిట్ అయితే విజయ్ దేవరకొండతో జన గణ మన చేయాల్సిన పూరీ లైగర్ రిజల్ట్ తేడా కొట్టడంతో ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసుకున్నాడు. అయితే డబుల్ ఇస్మార్ట్ హిట్ పడితే మళ్లీ జన గణ మన మీద ఫోకస్ చేయాలని చూస్తున్నాడు. జన గణ మన సినిమా కథ ముందు మహేష్ కి అనుకున్న పూరీ సూపర్ స్టార్ ఛాన్స్ ఇవ్వట్లేదని విజయ్ దేవరకొండతో చేయాలని ఫిక్స్ అయ్యాడు.

లైగర్ తర్వాత విజయ్ కూడా ఆ ప్రాజెక్ట్ వద్దని చెప్పడంతో ఇప్పుడు రామ్ తోనే ఆ సినిమా కూడా చేయాలని అనుకుంటున్నాడట పూరీ జగన్నాథ్. రామ్ తో ఇస్మార్ట్ శంకర్ హిట్ కొట్టిన పూరీ ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ తో కూడా అదే రేంజ్ సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు. డబుల్ ఇస్మార్ట్ కూడా హిట్ పడింది అంటే జన గణ మన షురూ అయినట్టే లెక్క.

ఇదే కాకుండా పూరీ తనయుడు ఆకాష్ పూరీతో కూడా ఒక ప్రయోగాత్మక సినిమా చేయాలని అనుకుంటున్నాడు. ఆల్రెడీ మెహబూబా సినిమా చేసినా అది కమర్షియల్ గా వర్క్ అవుట్ కాలేదు కాబట్టి ఆకాష్ కోసం ఒక క్రేజీ లవ్ స్టోరీ రాశాడట పూరీ జగన్నాథ్. సో రామ్ సినిమా కాగానే ఆకాష్ తో సినిమా ఉంటుందని తెలుస్తుంది. మొత్తానికి మళ్లీ డైరెక్టర్ గా తన మార్క్ చూపించాలని ప్రయత్నిస్తున్న పూరీకి ఇక నుంచైనా కాలం కలిసి రావాలని కోరుతున్నారు ఫ్యాన్స్. ఎన్ని ఫ్లాపులు వచ్చినా పూరీ మళ్లీ హిట్ కొడతాడనే నమ్మకంతో డైరెక్టర్ ఫ్యాన్స్ ఉన్నారు. వారి కోసమైనా పూరీ మళ్లీ తన స్టామినా ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు.