Begin typing your search above and press return to search.

ప్రశాంత్ వర్మ యూనివర్స్.. స్టార్ హీరోలు కూడా..

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో చేయబోయే సూపర్ హీరో కథలలో కొత్తవారిని పరిచయం చేయబోతున్నామని చెప్పారు.

By:  Tupaki Desk   |   24 April 2024 4:27 AM GMT
ప్రశాంత్ వర్మ యూనివర్స్.. స్టార్ హీరోలు కూడా..
X

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై భవిష్యత్తులో సూపర్ హీరో సినిమాల ట్రెండ్ గట్టిగా నడిచే అవకాశం ఉన్నట్లు అనిపిస్తుంది. ఇప్పటికే బాలీవుడ్ క్రిష్ సిరీస్ తో సూపర్ హీరో సినిమాలు వస్తున్నాయి. బ్రహ్మాస్త్ర సిరీస్ ద్వారా సూపర్ హీరోలని పరిచయం చేయబోతున్నారు. అలాగే శక్తిమాన్ సీరియల్ సినిమాగా మారబోతోంది. దాంతో పాటు మరికొన్ని సినిమాలు సూపర్ హీరో క్యారెక్టర్స్ తో స్టార్ట్ కాబోతున్నాయి.

మలయాళంలో మిన్నర్ మురళీ అంటూ ఒక సూపర్ హీరో మూవీ చేసి హిట్ కొట్టారు. తమిళంలో కూడా వీరన్ అనే మూవీ వచ్చింది. తెలుగులో హనుమాన్ సినిమాతో ప్రశాంత్ వర్మ సూపర్ హీరోల చిత్రాల కోసం సినిమాటిక్ యూనివర్స్ మొదలు పెట్టాడు. ఇందులో ఏకంగా 10 సూపర్ హీరో చిత్రాలు చేయబోతున్నట్లు ప్రకటించారు.

మొదటి చిత్రంగా వచ్చిన హనుమాన్ బ్లాక్ బస్టర్ అయ్యింది. దీనికి సీక్వెల్ గా జై హనుమాన్ తెరకెక్కబోతోంది. ఈ సినిమాలో స్టార్ హీరో నటించబోతున్నాడు అని ప్రశాంత్ వర్మ ఇప్పటికే కన్ఫర్మ్ చేసేసాడు. అయితే అతను ఎవరనేది రివీల్ చేయలేదు. ఇదిలా ఉంటే హనుమాన్ మూవీ తాజాగా 100 రోజులు పూర్తి చేసుకుంది.

ఈ సందర్భంగా ప్రశాంత్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో చేయబోయే సూపర్ హీరో కథలలో కొత్తవారిని పరిచయం చేయబోతున్నామని చెప్పారు. సినిమాటిక్ యూనివర్స్ లో భాగస్వామ్యం అవుతామని అన్ని ఇండస్ట్రీల నుంచి స్టార్స్ యాక్టర్స్ సంప్రదిస్తున్నారని తెలిపాడు.

కచ్చితంగా నెక్స్ట్ రాబోయే సూపర్ హీరోల చిత్రాలలో ఇతర భాషలకి సంబందించిన నటులకి ఛాన్స్ ఉంటుందని తెలిపాడు. అన్నిటికంటే జై హనుమాన్ మూవీ నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని స్పష్టం చేశాడు. జై హనుమాన్ తో తర్వాత డివివి దానయ్య తనయుడితో అధీరా మూవీ సూపర్ హీరో జోనర్ లో ప్రశాంత్ వర్మ చేయబోతున్నాడు. ఈ సినిమాకి సంబందించిన పోస్టర్ ఎప్పుడో వదిలారు.

అయితే జై హనుమాన్ ముందుగా స్టార్ట్ చేయడంతో అధీరా వెనక్కి వెళ్ళింది. ఇండియన్ మైథాలజీ బేస్ చేసుకొని ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ యూనివర్స్ లో సూపర్ హీరోలని సృష్టిస్తున్నట్లు ఇప్పటికే తెలియజేశాడు. ఈ కథలతో మన మైథాలజీ కథలకి తిరిగి జీవం రాబోతుందని అర్ధమవుతోంది. మరి వీటికి ఇండియన్ ఆడియన్స్ నుంచి ఎలాంటి ఆదరణ లభిస్తుందనేది వేచి చూడాలి. మిరాయ్ తో మరోసారి తేజా సజ్జా సూపర్ హీరోగా కనిపించబోతున్నాడు. ఈ సినిమా హిట్ అయితే సీక్వెల్స్ వచ్చే అవకాశం ఉంది.