Begin typing your search above and press return to search.

CID విచారణపై ప్రకాష్ రాజ్ రియాక్షన్..

కానీ బెట్టింగ్ యాప్ అనుకొని తర్వాత దానిని వదిలేసాను. ఇతర కంపెనీలకు ఎక్కడా కూడా నేను ఇలా ప్రమోషన్ చేయలేదు.

By:  Madhu Reddy   |   12 Nov 2025 6:07 PM IST
CID విచారణపై ప్రకాష్ రాజ్ రియాక్షన్..
X

బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు ఈడీ ముందు విచారణకు హాజరయ్యి.. తమ వాదనలు వినిపించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు రంగంలోకి సీఐడీ దిగింది. అందులో భాగంగానే నిన్న విజయ్ దేవరకొండ సీఐడీ విచారణకు హాజరు కాగా.. ఈరోజు ప్రకాష్ రాజ్ హాజరయ్యారు. సీఐడీ విచారణ తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన బెట్టింగ్ యాప్స్ పై అలాగే సీఐడీ విచారించిన పలు అంశాలపై.. అధికారులు అడిగిన ప్రశ్నలకు ప్రకాష్ రాజ్ ఏ విధంగా సమాధానమిచ్చారు ఇలా పలు విషయాలపై స్పందించారు.

ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. "అధికారులు నోటీసులు ఇచ్చిన విధంగానే మనం సీఐడీ ఎదుట విచారణకు హాజరయ్యాను. బెట్టింగ్ యాప్స్ తో జరిపిన బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్నింటినీ కూడా గతంలోనే సమర్పించాను. 2016లో బెట్టింగ్ యాప్ కి ప్రమోట్ చేశాను. అయితే నేను ప్రమోట్ చేసిన యాప్ ను 2017 లో నిషేదించారు. దయచేసి బెట్టింగ్ యాప్స్ ఎవరు వాడకండి. యువత ఈ బెట్టింగ్ యాప్ జోలికి అసలే వెళ్లకండి .ముఖ్యంగా అడ్డదారిలో వెళ్ళకండి. తెలిసి చేసినా తెలియక చేసిన తప్పు తప్పే కదా. ఈ బెట్టింగ్ యాప్ నిర్వహకులకు సంబంధించిన సమాచారాన్ని నేను సిఐడి విచారణలో అందించాను. అయితే నేను ప్రమోట్ చేసిన యాప్ మొదట గేమింగ్ యాప్ అనుకొని ప్రమోట్ చేసాము.

కానీ బెట్టింగ్ యాప్ అనుకొని తర్వాత దానిని వదిలేసాను. ఇతర కంపెనీలకు ఎక్కడా కూడా నేను ఇలా ప్రమోషన్ చేయలేదు. దయచేసి బెట్టింగ్ యాప్స్ ఎవరూ కూడా ఉపయోగించకండి. డబ్బులు పెట్టి అసలు బెట్టింగ్ చేయకండి. ప్రజలు, యంగ్ స్టార్స్ కచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఇప్పటికే ఈ బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు పెట్టుబడిగా పెట్టి ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇది చాలా అత్యంత దారుణమైన పరిస్థితి దయచేసి ఎవరూ కూడా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయకండి" అంటూ ప్రకాష్ రాజ్ తెలిపారు. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ఇకపోతే సీఐడీ విచారణకు హీరో విజయ్ దేవరకొండ కూడా హాజరయ్యారు. విచారణ అనంతరం ఆయన కూడా మీడియాతో మాట్లాడుతూ.. ఏ 23 గేమింగ్ యాప్ ను ప్రమోట్ చేశాను. ఇది తెలంగాణలో ఓపెన్ అవ్వదు. అయితే ఈ గేమింగ్ యాప్ తో జరిపిన లావాదేవీలకు సంబంధించిన అన్ని స్టేట్మెంట్లను నేను అధికారులకు అందించాను అంటూ విజయ్ దేవరకొండ క్లారిటీ ఇచ్చారు.

మరొకవైపు సిరి హనుమంతును కూడా లకిడికపూల్ లో ఉన్న సిఐడి కార్యాలయంలో అధికారులు విచారణ జరిపారు. ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల వచ్చిన డబ్బుతో ఆమె మూడు బ్యూటీ ట్రీట్మెంట్ హాస్పిటల్స్ ను నిర్మించింది అంటూ వార్తలు రావడంతోనే అధికారులు ఆమెను విచారించినట్లు సమాచారం.