Begin typing your search above and press return to search.

రాజాసాబ్‌... ప్రభాస్ ఫ్రెండ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

ఇప్పటికే దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ కల్కి ని పాన్ ఇండియా మూవీ కాదు.. ఇది పాన్ వరల్డ్‌ మూవీ అంటూ ప్రకటించాడు

By:  Tupaki Desk   |   8 March 2024 9:18 AM GMT
రాజాసాబ్‌... ప్రభాస్ ఫ్రెండ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
X

ప్రభాస్ గత ఏడాది చివర్లో సలార్‌ మొదటి పార్ట్‌ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో తదుపరి సినిమా కల్కి 2898 ఏడీ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ కల్కి ని పాన్ ఇండియా మూవీ కాదు.. ఇది పాన్ వరల్డ్‌ మూవీ అంటూ ప్రకటించాడు.

టైమ్‌ ట్రావెల్‌ కాన్సెప్ట్‌ తో హాలీవుడ్ రేంజ్ లో కల్కి సినిమా రూపొందుతుంది. మే 9న రాబోతున్న కల్కి కోసం ఎంత ఆసక్తిగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారో మారుతి దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా రూపొందుతున్న రాజాసాబ్‌ సినిమా కోసం కూడా అంతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

రాజాసాబ్‌ సినిమాను మారుతి రూపొందిస్తున్నాడు కనుక పాన్ ఇండియా రేంజ్ లో ఎలా ఆడుతుందో అనే అనుమానాలు కొందరు వ్యక్తం చేశారు. ఆ అనుమానాలు పటాపంచలు చేసే విధంగా ప్రభాస్‌ కి అత్యంత ఆప్తుడిగా పేరున్న ప్రభాస్ శ్రీను ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఇటీవల ఒక కార్యక్రమంలో భాగంగా ప్రభాస్ శ్రీను మాట్లాడుతూ... ప్రభాస్‌, మారుతిల కాంబోలో రాబోతున్న రాజాసాబ్‌ సినిమా పాన్ ఇండియా కంటే పెద్ద ప్రాజెక్ట్‌. చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇతర రెగ్యులర్‌ సినిమాల మాదిరిగా రాజాసాబ్‌ అస్సలు ఉండదు. ఇప్పటి వరకు ప్రేక్షకులు చూడని యాంగిల్స్ రాజాసాబ్‌ లో ఉంటాయి.

సాధారణంగా రోజు తినే భోజనం కు, పండుగ పూట తినే భోజనంకు ఎంత తేడా ఉంటుందో అలాగే రాజాసాబ్‌ సినిమా కూడా చాలా ప్రత్యేకంగా పండుగ భోజనం మాదిరిగా ఉంటుంది అంటూ ప్రభాస్ శ్రీను చేసిన వ్యాఖ్యలు ఫ్యాన్స్ లో రాజాసాబ్ సినిమా పై అంచనాలు మరింత పెంచాయి. ఇప్పటి వరకు విడుదల తేదీ విషయంలో క్లారిటీ ఇవ్వని మారుతి త్వరలో ఆ విషయమై స్పష్టత ఇస్తాడేమో చూడాలి.