Begin typing your search above and press return to search.

OG: పాన్ ఇండియా సినిమాలకు ధీటుగా పవర్ స్టార్ స్టామినా!

ఈ మూవీ నైజాం రైట్స్ ఏకంగా 55 కోట్లకి సెట్ అయ్యే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలలో వినిపిస్తోన్న మాట.

By:  Tupaki Desk   |   8 April 2024 3:52 AM GMT
OG: పాన్ ఇండియా సినిమాలకు ధీటుగా పవర్ స్టార్ స్టామినా!
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు ఫ్లాప్ అయిన కూడా ఆయన ఇమేజ్ అంతకంతకు పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గేది కాదని సినీ పెద్దలు బలంగా నమ్ముతారు. తెలుగు రాష్ట్రాలలో పవన్ కళ్యాణ్ కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ సినిమాలకి మించి అతన్ని ఆరాధించే స్థాయికి చేరిపోయింది. అందుకే పవన్ కళ్యాణ్ సినిమాల రిలీజ్ విషయంలో ఆటంకాలు ఎదురవుతున్న అతని మీద వంద కోట్ల బడ్జెట్ పెట్టడానికి నిర్మాతలు ముందుకొస్తున్నారు.

ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతోన్న పాన్ ఇండియా సినిమాని డివివి దానయ్య 150 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ మూవీ మెజారిటీ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయిపొయింది. పవన్ ఓ రెండు వారాల కాల్ షీట్స్ ఇస్తే మొత్తం కంప్లీట్ అయిపోనుందని తెలుస్తోంది. ఎన్నికలు ముగిసిన తర్వాత పవన్ కళ్యాణ్ ఫస్ట్ కంప్లీట్ చేయబోయే సినిమా ఓజీనే.

అందుకే సెప్టెంబర్ 27న మూవీ రిలీజ్ అవుతుందని కాన్ఫిడెంట్ గా చిత్ర యూనిట్ చెబుతుంది. పవన్ కళ్యాణ్ తన సినిమాలకి పెద్దగా ప్రమోషన్స్ చేయరు. అయిన కానీ పవర్ స్టార్ అనే పేరు, ఆయన కటౌట్ సినిమాకి కావాల్సినంత మార్కెట్ తీసుకొస్తుంది. ఓజీ సినిమాకి సంబందించిన బిజినెస్ డీల్స్ ప్రస్తుతం నడుస్తున్నాయంట.

ఈ మూవీ నైజాం రైట్స్ ఏకంగా 55 కోట్లకి సెట్ అయ్యే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలలో వినిపిస్తోన్న మాట. ఇదే డీల్ ఫైనల్ అయితే టాలీవుడ్ నాలుగవ హైయెస్ట్ నైజాం రైట్స్ ఓజీ పేరుమీదనే ఉంటాయి. దీనికంటే ముందు స్థానంలో ఆర్ఆర్ఆర్ 75 కోట్లతో టాప్ లో ఉన్నట్లు టాక్, ఇక కల్కి 2898ఏడీ కి దాదాపు అదే రేంజ్ లో డీల్ ఫైనల్ అవుతున్నట్లు టాక్, ఇక సలార్ నైజాం రైట్స్ 65 కోట్లతో టాప్ లిస్టులో కొనసాగుతోంది.

ఈ మూడింటిలో రెండు పాన్ ఇండియా స్టార్ గా దూసుకుపోతున్న ప్రభాస్ సినిమాలే కావడం విశేషం. ఇక పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా స్టార్ అనే ఇమేజ్ ఇంకా తెచ్చుకోలేదు. కానీ ఓజీ సినిమాతో పాన్ ఇండియా హీరోలతో పోటీ పడుతూ ఉండటం విశేషం. ఇప్పుడు నైజాం లెక్క టాప్ లోనే ఉన్నట్లు ఇండస్ట్రీలో వినిపిస్తోన్న మాట. ఓజీని రెండు భాగాలుగా సుజిత్ తెరకెక్కించనున్నాడంట.

అందులో మొదటి పార్టీ సెప్టెంబర్ లో రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా మెయిన్ విలన్ గా ఇమ్రాన్ హష్మీ కనిపించబోతున్నారు. అలాగే ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి లాంటి స్టార్ క్యాస్టింగ్ ఉన్నారు. ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఓజీ మూవీ కథ ఉండబోతోందని తెలుస్తోంది.