Begin typing your search above and press return to search.

తెర‌పైకి భ‌గ‌త్ సింగ్..జులైలో రీ స్టార్ట్!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ రీ స్టార్ట్ అవుతున్నారా? అంటే అవున‌నే తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   24 April 2025 7:30 PM
తెర‌పైకి భ‌గ‌త్ సింగ్..జులైలో రీ స్టార్ట్!
X

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ రీ స్టార్ట్ అవుతున్నారా? అంటే అవున‌నే తెలుస్తోంది. పెండింగ్ చిత్రాల‌ను వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని పీకే బ‌లంగా నిర్ణయించుకున్న‌ట్లు విశ్వ స‌నీయ స‌మాచారం. హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు, ఓజీ సినిమాల‌ను వేగంగా పూర్తి చేసి ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రావాల‌ని ఆయ‌న బ‌లంగా అడుగులు వేస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ వాటి గురించి ప‌ట్టించుకోక‌పోయినా? ఇక‌పై మాత్రం కొన్నాళ్ల పాటు సినిమాల‌తోనే బిజీగా ఉండాల‌ని భావిస్తున్నారుట‌.

ఇప్ప‌టికే వీర‌మ‌ల్లు చిత్రాన్ని మే 9న రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఆ తేదీకి ప‌క్కాగా వ‌చ్చేస్తుందని మేక‌ర్స్ బ‌లంగా చెబుతున్నారు. వాళ్ల ధీమా చూస్తుంటే? వ‌చ్చేసేలా ఉన్నారు. అలాగే ఓజీ చిత్రాన్ని ఎట్టి ప‌రిస్థితుల్లో సెప్టెంబ‌ర్ లో రిలీజ్ చేస్తా మంటున్నారు. అందుకు త‌గ్గ‌ట్టు ప‌వ‌న్ చిత్రీక‌ర‌ణకు డేట్లు కేటా యించిన‌ట్లు తెలిసింది. అలా ఈ రెండు సినిమాల గురించి ఓ క్లారిటీ వ‌చ్చింది.

మ‌రి ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ సంగ‌తేంటి? అంటే అందుకు హ‌రీష్ శంక‌ర్ కూడా ఫిగ‌ర్ కావాల్సిన ప‌నిలేద‌ని తెలిసింది. ఈ సినిమా షూటింగ్ కూడా మొద‌లైన సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్ పై ఓ షెడ్యూల్ కూడా జ‌రి గింది. కానీ అనూహ్యంగా ఈ చిత్రాన్ని ఆపేసారు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ ప‌వ‌న్ ఈ సినిమా గు రించి ఆలోచిం చ‌లేదు. దీంతో హ‌రీష్ శంక‌ర్ ఇత‌ర స్టార్ల‌తో కొన్ని సినిమాలు చేసారు.

కానీ తాజాగా మ‌ళ్లీ జులై నుంచి ప‌వ‌న్ భ‌గ‌త్ సింగ్ షూటింగ్ లో పాల్గొంటార‌ని ఆయ‌న స‌న్నిహితుల నుంచి తెలిసింది. జులై లోపు ఓజీ షూటింగ్ పూర్తి చేసుకుని ఖాళీ అయిపోతార‌ని...అనంత‌రం భ‌గ‌త్ సింగ్ కే డేట్లు కేటాయిస్తార‌ని అంటున్నారు. మ‌రి ఇందులో వాస్త‌వం తెలియాల్సి ఉంది. అదే జ‌రిగితే హ‌రీష్ శంక‌ర్ టైమ్ వ‌చ్చిన‌ట్లే. ప‌వ‌న్ ఎప్పుడు వ‌స్తాడా? అని హ‌రీష్ ఎంతో క్యూరియ‌స్ గా ఎదురు చూస్తున్నాడు. ప‌వ‌న్ త‌ప్ప మ‌రో ఆప్ష‌న్ కూడా లేదు. పైగా హ‌రీష్ ప్లాప్ ల్లో ఉన్నాడు. ప‌వ‌న్ తో హిట్ కొడితే మ‌ళ్లీ స్టార్ హీరోలంతా ట‌చ్ లో కి వ‌స్తారు.