Begin typing your search above and press return to search.

పరశురామ్ తో గొడవ క్లారిటీ వచ్చేసింది..!

గీతా ఆర్ట్స్ లో గీతా గోవిందం సినిమా చేసిన పరశురామ్ ఆ తర్వాత అదే బ్యానర్ లో మరో సినిమా చేయాల్సి ఉన్నా మహేష్ కోసం బయటకు వచ్చి సినిమా చేశాడు.

By:  Tupaki Desk   |   25 Nov 2023 4:41 AM GMT
పరశురామ్ తో గొడవ క్లారిటీ వచ్చేసింది..!
X

గీతా ఆర్ట్స్ లో గీతా గోవిందం సినిమా చేసిన పరశురామ్ ఆ తర్వాత అదే బ్యానర్ లో మరో సినిమా చేయాల్సి ఉన్నా మహేష్ కోసం బయటకు వచ్చి సినిమా చేశాడు. మహేష్ తో సర్కారు వారి పాట తర్వాత గీతా ఆర్ట్స్ తోనే పరశురాం సినిమా చేయాల్సి ఉన్నా సడెన్ గా దిల్ రాజుతో సినిమా లాక్ చేశాడు. విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ డైరెక్షన్ లో వస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమా గీతా ఆర్ట్స్ లో చేయాల్సిందని అనుకున్నారు.

పరశురాం చేసిన పనికి అల్లు అరవింద్ ఒక ఈవెంట్ లో ఇన్ డైరెక్ట్ గా కామెంట్ చేశారు. ఈ వ్యవహారంపై నిర్మాత బన్నీ వాసు క్లారిటీ ఇచ్చారు. గీతా గోవిందం తర్వాత విజయ్ పరశురామ్ కాంబినేషన్ లో ఒక సినిమా చేయాలని అనుకున్నాం అందుకోసం ఒక కథ కూడా ఓకే అయ్యింది. ఆ టైం లో విజయ్ ఫోన్ చేసి పరశురాం చెప్పిన ఇంకో కథ నచ్చి దిల్ రాజు బ్యానర్ లో ఈ సినిమా చేస్తానని చెప్పాడు. ఈ విషయం అరవింద్ గారిని, నన్ను ఎంతో బాధపెట్టిందని అన్నారు బన్నీ వాసు. పరశురామ్ ఆ విషయాన్ని చెప్పలేదు. ఆ మిస్ కమ్యునికేషన్ వల్ల మేం హర్టయ్యాం.

ఆ టైం లో వేడి మీద అలా కామెంట్ చేశారు. విషయం అతని ద్వారా కాకుండా వేరే వాళ్ల ద్వారా తెలియడం బాధపెట్టింది. ఆ తర్వాత పరశురాం ఫోన్ చేసి 14 రీల్స్ లో ఉండగా అనుకున్న లైన్ ఫోన్ లోనే దిల్ రాజు సినిమా ఓకే చేశారని ఆ విషయం పొద్దున చెబుదామని అనుకునేలోగా ఇలా అయిపోయిందని వివరణ ఇచ్చారట. దిల్ రాజు కూడా ఫోన్ చేసి సినిమాలో వాటా కావాలంటే తీసుకో అన్నారు. కానీ అరవింద్ గారు అలా వద్దని చెప్పారు. ఇప్పుడు మ్యాటర్ అంతా సెటిల్ అయ్యింది. విజయ్ పరశురాం కాంబినేషన్ లో మా బ్యానర్ లో సినిమా ఉంటుందని బన్నీ వాసు చెప్పారు.

ఆ టైం లో డైరెక్టర్ మీద కోపం తో అల్లు అరవింద్ ప్రెస్ మీట్ కూడా పెట్టాలని అనుకున్నారు. కానీ ఈ గ్యాప్ లోనే మ్యాటర్ సెటిల్ చేసుకున్నారు. మొత్తానికి పరశురాం చెప్పాలనుకున్న మ్యాటర్ లేట్ అవ్వడం వల్ల అల్లు అరవింద్ హర్ట్ అయ్యారని తెలుస్తుంది. అయితే ఇప్పుడు అంతా సర్దుమణిగింది కాబట్టి విజయ్ పరశురాం మరో సినిమా చేయాలని గీతా ఆర్ట్స్ ప్లానింగ్ లో ఉంది.