Begin typing your search above and press return to search.

పాక్ గుండెలపైనే భారత్ .గుద్దుడు!

భారత్ విషయం చెప్పాలీ అంటే అత్యంత శాంతమూర్తిగా ఉంటుంది. మహాభారతంలో ధర్మరాజు పోలిక అన్న మాట.

By:  Tupaki Desk   |   8 May 2025 5:01 PM
Lahore Air Defense Destroyed
X

భారత్ విషయం చెప్పాలీ అంటే అత్యంత శాంతమూర్తిగా ఉంటుంది. మహాభారతంలో ధర్మరాజు పోలిక అన్న మాట.అలుగుటయే యెరుంగని మహామహితాత్ముడు అజాతసెత్రుడే అలిగిననాడు సాగరముల్లన్ని ఏకముగాకపోవు అన్న చందాన భారత్ సహనం హద్దులు దాటిన నాడు వచ్చే ఉగ్ర రూపం చూసి ప్రపంచమే గడగడలాడాల్సిందే.

అటువంటిది భారత్ ని ఎంతగానో విసిగించిన దాయాది పాక్ విషయంలో ఇక ధర్మరాజు మాదిరిగా అలిగింది. అంతే పాక్ పీచమణచడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటిదాకా భారత్ వీరావేశాన్ని ప్రతాపాన్ని పాక్ చూసి ఉండదు. 1971లో లాహోర్ దాకా భారత సేనలు వచ్చి పాక్ మూకలను తన్ని తరిమేసి ఏకంగా 97 వేల మంది పాక్ సైనికులను బంధీలుగా పట్టుకున్నాయి.

ఈసారి అలా కాదు ఏకంగా పాక్ గుండెల మీదనే గుద్దుడు మొదలైంది. ఏ లాహోరు ని చూసి సురక్షితమైనదని ఎక్కడికైనా తన గురి పెట్టవచ్చు అని పాక్ ఆలోచిస్తోందో ఆ లాహోర్ నే భారత్ టార్గెట్ చేసింది. ఇక పాక్ కి దిక్కులు చూడడం తప్ప ఏమీ గతి లేకుండా పోతోంది.

భారత్ టార్గెట్ ఏంటో పాక్ కి అర్ధమయ్యేలోగానే అగ్ర రాజ్యం అమెరికా పసిగట్టింది. అందుకే లాహోర్ లోని తన కాన్సులేట్ ఉద్యోగులు, పౌరులను వెంటనే ఆ నగరం విడిచి పోవాలని ఆదేశాలు జారీ చేసింది భారత్ చేపట్టిన అపరేషన్ షింధూర్ తో లాహోర్ కకావికలు కాబోతోంది అన్నది అమెరికాకు బాగా అర్ధమైంది అని అంటున్నారు.

ఇక లాహోర్ లో భారత్ చేసిన పని ఏంటి అంటే హెచ్‌ క్యూ 9 ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థ రాడార్‌ లను సమూలంగా ధ్వంసం చేయడం. ఈ ఒక్క సీరియస్ యాక్షన్ చూసిన అమెరికాకు భారత్ ఉగ్ర రూపం ఏమిటో తెలిసిపోయింది పాక్ పని పట్టేంతవరకూ భారత్ ఆగదన్నది కూడా బాగా బోధపడింది దాంతో అమెరికా తన జాగ్రత్తలో తాను ఉంటూ తన పౌరులను కాపాడుకునే పనిలో పడింది.

మరో వైపు భారత్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ అతంత పటిష్టంగా ఉంది. భారత్ కి చెందిన ఎస్ శ్ 400 రక్షణ వ్యవస్థలు పాక్ దాడులను తిప్పికొడుతూ సమర్ధంగా కౌంటర్ ఎటాక్ చేయడంతో పాక్ కి ఇక మిగిలింది ఏమీ లేదు అన్నది అర్ధం అయింది ఒక్క దెబ్బతో పాక్‌ ప్రయోగించిన చాలా ఆయుధాలను భారత్ నిర్వీర్యం చేసింది అంటేనే దాయాదికి చేసేందుకు ఏమీ లేదని అర్ధం అవుతోంది.

భారత్ పట్టుదల చూసినా ఈ ఆపరేషన్ లో భారత్ వ్యూహాలు చూసినా పాక్ నడిబొడ్డునే తన జెండాను పాతేయడానికే సిద్ధంగా ఉంది అని అర్ధం అవుతోంది. పాక్ భూభాగంలో నిలబడి భారత్ దాడులు చేయడం అంటే దాయాది సార్వభౌమత్వం ఎలా గాలికి ఎగిగిపోయిందో అర్ధం అవుతోంది.

రానున్న రోజుల్ల దశల వారీగా భారత్ చేసే ఆపరేషన్ లో భాగంగా పాక్ రూపాన్ని కకావికలు చేస్తూ ముక్క చెక్కలు చేసేలాగానే పక్కా ప్లాన్ రెడీ అయింది అని అంటున్నారు. ఈ దెబ్బతో పాక్ ఉనికికే ముప్పు వాటిల్లే పరిస్థితి ఏర్పడింది అని అంటున్నారు. మొత్తానికి భారత్ తో పెట్టుకుంటే నామరూపాలు లేకుండా పోతామని పాక్ కి తెలిసివచ్చేటప్పటికే అంతా అయిపోతోంది అని అంటున్నారు.