Begin typing your search above and press return to search.

అయ్యో.. రాజమౌళికి ఇదెక్కడి సెగ?

రాజమౌళి చిత్రాలకు ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథలు అందించగా.. అన్నయ్య కీరవాణి బాణీలు కడుతుంటారు.

By:  Tupaki Desk   |   25 Jan 2024 5:23 PM GMT
అయ్యో.. రాజమౌళికి ఇదెక్కడి సెగ?
X

ఎస్ఎస్ రాజమౌళి.. ఇది పేరు కాదు.. రాజముద్ర. ఆయన తెరకెక్కించిన సినిమాలకు ఎంత స్పెషలో చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి ఆయనే పరిచయం చేశారు. మనకు ఆస్కార్ అవార్డును తీసుకొచ్చారు. అయితే జక్కన్న సినిమాలు అంటే.. ఆయన ఫ్యామిలీ సైతం పని చేస్తుంది. అందులో వినిపించే ముఖ్యమైన పేర్లు విజయేంద్ర ప్రసాద్, కీరవాణి, కార్తికేయ. రాజమౌళి చిత్రాలకు ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథలు అందించగా.. అన్నయ్య కీరవాణి బాణీలు కడుతుంటారు.

అయితే ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత రాజమౌళి..సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ సినిమా చేయనున్నారు. ఆఫ్రికా బ్యాక్‌ డ్రాప్‌ లో అడ్వెంచర్ థ్రిల్లర్‌ గా రూపొందనున్న ఈ మూవీకి కూడా జక్కన్న ఫాదరే కథ అందిస్తున్నారు. ఇక కీరవాణియే ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ అని సమాచారం. ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ అప్డేట్ రాకపోయినప్పటికీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ రెడీ అయిందని చెప్పారు.

ఇది పక్కన పెడితే.. సాధారణంగా మీడియా విషయంలో కీరవాణి, రాజమౌళి కాస్త కంట్రోల్ గా ఉంటారు. కీరవాణి ఏదైనా సినిమా టైమ్ లో ఇంటర్వ్యూ ఇవ్వాలనిపిస్తే ఓన్లీ పర్శనల్ గా ఇస్తారు. ఆ సమయంలో ఎలాంటి బెరుకు లేకుండా ప్రతీ విషయాన్ని క్లారిటీగా చెప్పేస్తారు. మరోవైపు, రాజమౌళి మీడియాతో విషయాలు షేర్ చేసుకునే కన్నా.. మూవీ క్రియేషన్ పై ఎక్కువ ఇంట్రెస్ట్ పెడతారు.

వీళ్లిద్దరు ఇలా ఉంటే.. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ రూటే వేరు. తరచూ ఏదో ఒక ఇంటర్వ్యూ ఇస్తుంటారు. కుండబద్దలు కొట్టేలా మాట్లాడుతుంటారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు.. ఆర్ఆర్ఆర్ అభిమానుల మధ్య మాటల యుద్ధానికి దారితీశాయి. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో 'ఆర్ఆర్ఆర్ కథ రాసేటప్పుడు తారక్, చరణ్ పాత్రలు ఒకేలా అనిపించాయి. ఒకేలా అనుకునే రాశాం.. చరణ్ పాత్రలో చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఎన్టీఆర్ పాత్రలో అమాయకత్వం ఉంటుంది.. ఎన్టీఆర్ పోషించిన పాత్ర చేయడం చాలా కష్టం.. కథను ముందుకు తీసుకెళ్లడంలో సపోర్టింగ్‌ గా ఉంటుంది' అని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు.

అయితే ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ టైమ్ లో కూడా ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ మధ్య ఎవరి పాత్ర ఎంతన్న విషయంలో వార్ జరిగింది. మళ్లీ ఇప్పుడు విజయేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలతో అదే వార్ మొదలైంది. అంతే కాకుండా విజయేంద్ర ప్రసాద్ పై ట్రోల్స్ ఫుల్ గా వస్తున్నాయి. దీంతో ఆ ఎఫెక్ట్.. మహేశ్ బాబుతో రాజమౌళి తెరకెక్కించబోయే సినిమాపై పడతుందని సినీ ప్రియులు అంటున్నారు. SSMB 29 ప్రాజెక్ట్ కు సంబంధించి కూడా ఎలాంటి అప్డేట్లు ఇవ్వొద్దని తండ్రికి జక్కన్న చెప్పారట. కానీ ఆయన మాత్రం.. స్టోరీ, లొకేషన్ ఇలా అనేక అప్డేట్లు ఇచ్చేస్తున్నారు. దీంతో రాజమౌళికి ఇవన్నీ కొంత తలనొప్పిని తెప్పిస్తున్నాయట. మహేశ్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నా.. తండ్రి ఇంటర్వ్యూల వద్ద ఇబ్బందిగా అనిపిస్తోందని టాక్.