Begin typing your search above and press return to search.

ప్రమాదంలో నితిన్ కు గాయాలు.. ఏం జరిగిందంటే?

అయితే షూటింగ్ స్టార్ట్ అయ్యి.. కొన్నిపైట్ సీన్లు తీయగా.. ఇంతలో నితిన్ చేతికి పెద్ద గాయం అయినట్టు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   11 Jan 2024 5:39 AM GMT
ప్రమాదంలో నితిన్ కు గాయాలు.. ఏం జరిగిందంటే?
X

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్.. ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తమ్ముడు సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లోని మారేడుమిల్లి అడవుల్లో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. అక్కడ భారీ యాక్షన్ సీన్స్ ను చిత్రీకరించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు మేకర్స్. అయితే షూటింగ్ స్టార్ట్ అయ్యి.. కొన్నిపైట్ సీన్లు తీయగా.. ఇంతలో నితిన్ చేతికి పెద్ద గాయం అయినట్టు తెలుస్తోంది.

వెంటనే ఈ మూవీ షూటింగ్ ను నిలిపివేశారట మేకర్స్. అంతే కాదు నితిన్ కు మూడు వారాల పాటు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారట. దీంతో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. నితిన్ గాయపడ్డారని వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో ఆయన ఫ్యాన్స్ నెట్టింట ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇక నితిన్.. చాలా రోజుల నుంచి సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. సరైన సూపర్ హిట్ దొరక్క ఇబ్బంది పడుతున్నారు. 2023లో ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా.. ఆ సినిమా మెప్పించలేకపోయింది. ఇప్పుడు నితిన్.. దిల్ రాజు బ్యానర్ పై తెరకెక్కుతున్న తమ్ముడు సినిమా మీదే ఆశలన్నీ పెట్టుకున్నారు. గతంలో ఇదే బ్యానర్‌ పై శ్రీనివాస కళ్యాణం చిత్రంలో నితిన్ నటించిన విషయం తెలిసేందే.

అక్కా, తమ్ముడు అనుబంధం నేపథ్యంలో నితిన్ కొత్త సినిమా తెరకెక్కుతున్నట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అందుకే ఈ చిత్రానికి తమ్ముడు అనే టైటిల్‌ ను ఫిక్స్‌ చేసినట్లు సమాచారం. అటు డైరెక్టర్ వేణు శ్రీరామ్ కూడా ఈ సినిమాపైనే హోప్స్ తో ఉన్నారు. పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ చేసిన వేణు.. చాలా గ్యాప్ తీసుకున్నారు. బన్నీతో ప్రాజెక్ట్ ఆగిపోవడంతో.. చాలా కాలం సినిమా కోసం ఎదురుచూశారు. ప్రస్తుతం నితిన్ తో హిట్టు కొట్టాలని పట్టుదలతో ఉన్నారు.

మరోవైపు, ఈ సినిమా కోసం నితిన్ చాలా కష్టపడుతున్నారు. తన ఫ్యాన్స్‌ కు సినిమా రూపంలో మంచి గిఫ్ట్‌ ఇవ్వాలని గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో షూటింగ్‌ స్పాట్‌లో ఆయనకు ప్రమాదం జరిగిందనే వార్త బయటకు రావడంతో నితిన్‌ త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. ఈ ప్రమాదం గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన ఇంకా రాలేదు.