Begin typing your search above and press return to search.

2023 ని గుర్తుండిపోయేలా చేసారుగా!

2023 ని గ్రాండ్ గా ముగించారు ఈ న‌యా ద‌ర్శ‌కులు. ముగ్గురు ముగ్గురే అన్న‌ట్లు ఒక‌రికొక‌రు పోటీ ప‌డీ మ‌రి గ్రాండ్ విక్ట‌రీలు న‌మోదు చేసారు

By:  Tupaki Desk   |   29 Dec 2023 2:30 PM GMT
2023 ని గుర్తుండిపోయేలా చేసారుగా!
X

2023 ని గ్రాండ్ గా ముగించారు ఈ న‌యా ద‌ర్శ‌కులు. ముగ్గురు ముగ్గురే అన్న‌ట్లు ఒక‌రికొక‌రు పోటీ ప‌డీ మ‌రి గ్రాండ్ విక్ట‌రీలు న‌మోదు చేసారు. ఇండియాన్ బాక్సాఫీస్ ని వ‌సూళ్ల‌తో షేక్ చేసారు. 100..200 కోట్లు కాదు వంద‌లకు వంద‌ల కోట్లు వ‌సూళ్ల‌తో సౌత్ ఇండ‌స్ట్రీ స‌త్తా ఏంటో మ‌రోసారి చూపించారు. కొడితే కుంభ స్థ‌లాన్నే కొట్టాల‌న్న‌ట్లు మూడు భారీ విజ‌యాలు న‌మోదు చేసి 2023ని గ్రాండ్ గా ముగించారు.


వారే ప్ర‌శాంత్ నీల్... సందీప్ రెడ్డి వంగ‌.. అట్లీ. షారుక్ ఖాన్ క‌థానాయ‌కుడిగా అట్లీ బాలీవుడ్ కి వెళ్లి తెర‌కెక్కించిన 'జ‌వాన్' సెప్టెంబ‌ర్ 7న రిలీజ్ అయి ఎలాంటి విజ‌యం సాధించిందో తెలిసిందే. అప్ప‌టికే 'ప‌ఠాన్' తో భారీ విజ‌య ఉ త్సాహంలో ఉన్న ఖాన్ బాయ్ ఉత్సాహాన్ని జ‌వాన్ విజ‌యం రెట్టింపు చేసింది. జ‌వాన్ ఏకంగా 1100 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ని సాధించింది. దీంతో మ‌రోసారి షారుక్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ అందుకున్నాడు అట్లీ.

అటుపై ర‌ణ‌బీర్ క‌పూర్ హీరోగా బాలీవుడ్ కెళ్లి సందీప్ రెడ్డి వంగ 'యానిమ‌ల్' చేసాడు. ఇది ఇండియాని షేక్ చేసిన సినిమా. హిందీ సినిమా అయినా తెలుగులో ర‌ణ‌బీర్ కి గొప్ప లాంచింగ్ చిత్రంలో మిగిలిపో యింది. డిసెంబ‌ర్ 1న రిలీజ్ అయిన సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద 800 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ని సాధించింది. ఆ ర‌కంగా సందీప్ కెరీర్ లో తొలి భారీ వ‌సూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.

ఇక ఇదే నెల 22న రిలీజ్ అయిన ప్ర‌భాస్-ప్ర‌శాంత్ నీల్ 'స‌లార్ సీజ్ పైర్' బాక్సాఫీస్ ని ఎలా దున్నేస్తుం దో చూస్తునే ఉన్నాం. మొద‌టి రోజే ఏకంగా 170 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ని సాధించింది. ఇప్ప‌టివ‌ర‌కూ 400 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ని సాధించింది. ఈ లెక్క ఎంత‌కు పెరుగుతుందా? ఇంకా అంచ‌నా వేయ‌లేం. 'స‌లార్' థియేట‌ర్ల‌న్నీ హౌస్ పుల్ గా ర‌న్నింగ్ లో ఉన్నాయి. ఇలా ముగ్గురు న‌యా ద‌ర్శ‌కులు మూడు భారీ విజ‌యాలు అందుకుని రెట్టించిన ఉత్సాహంతో 2024లోకి అడుగు పెడుతున్నారు.