Begin typing your search above and press return to search.

నారా రోహిత్ ప్రతినిధి-2.. ఎన్నికలకు ముందే..

ఇటీవల విడుదలైన ఈ మూవీ టీజర్.. అంచనాలను మరిన్ని పెంచేసింది.

By:  Tupaki Desk   |   9 April 2024 4:08 PM GMT
నారా రోహిత్ ప్రతినిధి-2.. ఎన్నికలకు ముందే..
X

టాలెంటెడ్ హీరో నారా రోహిత్ ప్రస్తుతం ప్రతినిధి-2 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సుమారు ఆరేళ్ల తర్వాత టాలీవుడ్ లోకి ఆయన రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ పార్ట్ పదేళ్ల క్రితం థియేటర్లలోకి వచ్చి మంచి హిట్ అయింది. ఇప్పుడు ఈ సీక్వెల్ ను ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి తెరకెక్కిస్తున్నారు. దీంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన ఈ మూవీ టీజర్.. అంచనాలను మరిన్ని పెంచేసింది.


టీజర్ లో డైలాగులన్నీ రాజకీయాలను టార్గెట్ చేస్తూ సినిమాపై ఫుల్ క్యూరియాసిటీ క్రియేట్ చేశాయి. ఒళ్లు విరిచి బ‌య‌ట‌కు వ‌చ్చి ఓటేయండి... కుద‌ర‌క‌పోతే దేశం వ‌దిలి వెళ్లిపోండి.. అది కూడా కుద‌ర‌క‌పోతే చ‌చ్చిపోండి అనే ఇంటెన్స్ డైలాగ్‌.. సోషల్ మీడియాలో ఆ మధ్య తెగ చక్కర్లు కొట్టింది. నారా రోహిత్ ఈ చిత్రంలో ఓ టీవీ ఛానెల్ జర్నలిస్ట్ గా నటిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమాను ఏప్రిల్ లో రిలీజ్ చేస్తామని ప్రకటించిన మేకర్స్.. తాజాగా క్రేజీ అప్డేట్ ఇచ్చారు. మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. ఏప్రిల్ 25వ తేదీన సినిమాను విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రతికూల పరిస్థితుల్లో అన్ని అసమానతలకు వ్యతిరేకంగా ఒక వ్యక్తి మళ్లీ నిలబడతాడంటూ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. అందులో ప్రజలు ఏదో ఉద్యమం చేస్తున్నట్లు నినాదాలు చేస్తూ కనిపిస్తున్నారు.

విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్లు స్టార్ట్ చేశారు. త్వరలోనే థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. అయితే ప్రతినిధి-1 కూడా పదేళ్ల క్రితం ఏప్రిల్ 25వ తేదీన విడుదలైంది. అప్పుడు ఆ సినిమాను ప్రశాంత్ మండవ తెరకెక్కించగా.. ఇప్పుడు సీక్వెల్ ను జర్నలిస్ట్ మూర్తి డైరెక్ట్ చేస్తున్నారు. హీరోయిన్ గా సిరి లెల్లా నటిస్తుండగా.. దినేష్ తేజ్, సప్తగిరి, జిషు సేన్ గుప్తా, సచిన్ ఖేడేకర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.

అయితే నారా ఫ్యామిలీ నుంచి సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఏకైక మెంబర్ రోహిత్. ఇప్పటి వరకు ఆయన చేసిన అన్ని సినిమాల్లో ఏదో ఒక సామాజిక అంశం కచ్చితంగా దాగి ఉంటుంది. కమర్షియల్ చిత్రాలు చేయడానికి మొగ్గు చూపరు. 2018 లో ఒక్కసారిగా చిత్ర పరిశ్రమకు దూరమయ్యారు. మళ్లీ ప్రతినిధి సీక్వెల్ తో ఇప్పుడు రీ ఎంట్రీ ఇస్తున్నారు. మరి ఈ మూవీతో నారా రోహిత్ ఎలాంటి హిట్ కొడతారో వేచి చూడాలి.