Begin typing your search above and press return to search.

దాని వ‌ల్లే శ్రీవిష్ణు ఏం చేసినా కొత్త‌గా ఉంటుంది

ఇత‌ర హీరోల‌కు భిన్నంగా విల‌క్ష‌ణ కథ‌లు, పాత్ర‌లు ఎంపిక చేసుకుంటూ త‌న‌దైన శైలిలో ఆడియ‌న్స్ ను అల‌రిస్తూ వ‌స్తున్న నారా రోహిత్ ప్ర‌స్తుతం భైర‌వం అనే సినిమా చేస్తున్నాడు.

By:  Tupaki Desk   |   28 May 2025 8:20 AM
దాని వ‌ల్లే శ్రీవిష్ణు ఏం చేసినా కొత్త‌గా ఉంటుంది
X

బాణం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నారా రోహిత్ ఆ త‌ర్వాత సోలో, ప్ర‌తినిధి, రౌడీ ఫెలో, అసుర, జ్యో అచ్యుతానంద లాంటి మంచి సినిమాలు చేసి త‌న‌కంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇత‌ర హీరోల‌కు భిన్నంగా విల‌క్ష‌ణ కథ‌లు, పాత్ర‌లు ఎంపిక చేసుకుంటూ త‌న‌దైన శైలిలో ఆడియ‌న్స్ ను అల‌రిస్తూ వ‌స్తున్న నారా రోహిత్ ప్ర‌స్తుతం భైర‌వం అనే సినిమా చేస్తున్నాడు.

అయితే నారా రోహిత్ కు టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు కు మ‌ధ్య మంచి అనుబంధం ఉంద‌నే విష‌యం అంద‌రికీ తెలుసు. వారిద్ద‌రి మ‌ధ్య బాండింగ్ గురించి ఇప్ప‌టికే ఇద్ద‌రూ ఎన్నోసార్లు బ‌య‌ట‌ప‌డి మాట్లాడిన సంద‌ర్భాలున్నాయి. ఇప్పుడు భైర‌వం ప్ర‌మోష‌న్స్ లో భాగంగా శ్రీవిష్ణు గురించి నారా రోహిత్ మాట్లాడి కొన్ని ఇంట్రెస్టింగ్ విష‌యాల‌ను బ‌య‌ట‌పెట్టాడు.

తమిద్ద‌రి మ‌ధ్య మంచి బాండింగ్ ఉంద‌ని, తాము చాలా గ్రేట్ ఫ్రెండ్స్ అని, రియ‌ల్ లైఫ్ లో కూడా శ్రీవిష్ణు చాలా ఎంట‌ర్టైనింగ్ ప‌ర్సన్ అని, వ‌న్ లైన‌ర్స్ అయితే త‌న నోటి అంచునే ఉంటాయ‌ని, ఎంట‌ర్టైన్మెంట్ నీ బాడీ లాంగ్వేజ్ లోనే ఉంటుంద‌ని తాను శ్రీవిష్ణుకు డే1 నుంచే చెప్తూ వ‌స్తున్నాన‌ని, దానికి తోడు త‌ను లెఫ్టీ(ఎడ‌మ‌చేతి వాటం) అని, దాని వల్లే త‌నేం చేసినా కొత్త‌గా ఉంటుంద‌ని నారా రోహిత్ చెప్పుకొచ్చాడు.

టాలీవుడ్ లో అంద‌రూ రైట్ హ్యాండ‌ర్సేన‌ని, శ్రీవిష్ణు లెఫ్టీ అవ‌డంతో తానేం చేసినా డిఫ‌రెంట్ గా, కొత్త‌గా అనిపిస్తుంద‌ని, దానికి తోడు త‌న కామెడీ టైమింగ్ కు, త‌న బాడీ లాంగ్వేజ్ కు అది చాలా కొత్త‌గా క‌నిపిస్తుంద‌ని, మ‌ధ్య‌లో శ్రీవిష్ణు కొత్త కొత్త జానర్లు, ప్ర‌యోగాలు చేసిన‌ప్పటికీ కామెడీ సినిమాలు అంద‌రినీ ఎంత‌గానో అల‌రించాయ‌ని, అందుకే రెండు సినిమాలు చేస్తే అందులో ఒకటి కామెడీ మూవీ చేయ‌మ‌ని తాను శ్రీవిష్ణుకు సూచించాన‌ని, విష్ణు ఎంతో క‌ష్ట‌ప‌డతాడ‌ని, రీసెంట్ గా వ‌చ్చిన సింగిల్ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అవ‌డం త‌న‌కెంతో సంతోషాన్నిచ్చింద‌ని రోహిత్ చెప్పాడు.

ఇక భైర‌వం విష‌యానికొస్తే నాంది ఫేమ్ విజ‌య్ క‌న‌క‌మేడ‌ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మ‌నోజ్ కూడా లీడ్ రోల్స్ లో న‌టిస్తున్నారు. స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కూతురు అదితి శంక‌ర్ ఈ సినిమాతో వెండితెర అరంగేట్రం చేస్తోంది. జూన్ 5న రిలీజ్ కానున్న భైర‌వం సినిమా త‌ప్ప‌కుండా ఆడియ‌న్స్ ను మెప్పిస్తుంద‌ని చిత్ర యూనిట్ మొత్తం ఎంతో కాన్ఫిడెంట్ గా ఉంది.