Begin typing your search above and press return to search.

గుంటూరు కారం రిజల్ట్.. నిర్మాత నుంచి ఇలాంటి కౌంటరా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో గుంటూరు కారం మూవీ వచ్చిన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   19 March 2024 5:06 AM GMT
గుంటూరు కారం రిజల్ట్.. నిర్మాత నుంచి ఇలాంటి కౌంటరా?
X

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో గుంటూరు కారం మూవీ వచ్చిన విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 12వ తేదీన భారీ అంచనాల మధ్య విడుదలైంది. సూపర్ హిట్ కాంబో కావడంతో అటు ఫ్యాన్స్ తోపాటు ఇటు సినీ ప్రియులు.. మంచి హోప్స్ పెట్టుకున్నారు. కానీ ఈ సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది.

ఫస్ట్ షో నుంచి మిక్స్ డ్ టాక్ సంపాదించుకుందీ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం. అయితే లాభాల విషయం పక్కన పెడితే.. వసూళ్ల పరంగా మహేష్ రికార్డు సృష్టించారు. ఐదు రీజనల్ సినిమాలతో 100 కోట్ల షేర్ దక్కించుకున్న వన్‌ అండ్‌ ఓన్లీ హీరోగా సూపర్ స్టార్ రికార్డు క్రియేట్ చేశారు. సంక్రాంతి సెలవుల్లో మోస్తరు వసూళ్లు రాబట్టి.. బాక్సాఫీస్ వద్ద ఎబోవ్ యావరేజ్ గా నిలిచింది.

థియేటర్లలో రిలీజైన నాలుగు వారాలకే ఓటీటీలోకి వచ్చేసింది గుంటూరు కారం. అక్కడ పలు రికార్డులు కూడా క్రియేట్ చేసింది. చాలా రోజులుగా ఓటీటీ టాప్ లిస్ట్ లో నిలిచింది. హిందీ వెర్షన్ లో అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకుంది. మాస్ రోల్ లో మహేశ్ మ్యానరిజం, బాడీ లాంగ్వేజ్ ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకున్నాయి. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ప్రేక్షకులను అలరించింది.

అయితే ఈ సినిమా అమెరికాలో మూడు మిలియన్ల మార్క్ ఈజీగా క్రాస్ చేస్తుందని అంతా ఊహించారు. కానీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా కంప్లీట్ చేసుకోలేదని సమాచారం. మన దగ్గర కూడా ఈ సినిమా బయర్స్ నష్టపోయారని టాక్ వినిపిస్తోంది. తాజాగా ఈ విషయంపై గుంటూరు కారం నిర్మాత నాగవంశీ ఓ కార్యక్రమంలో స్పందించారు. గుంటూరు కారం మూవీతో మీడియా డిస్సపాయింట్ అయిందని, మేకర్స్ కాదని చెప్పారు.

ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నాగవంశీ వ్యాఖ్యలకు అర్థమేంటోనని అంతా చర్చించుకుంటున్నారు. బహుశా నాగ వంశీ సినిమా రిజల్ట్ పై హ్యాపీగానే ఉన్నారా లేదంటే కొన్ని వార్తలకు కౌంటర్ ఇచ్చారా అనేది హాట్ టాపిక్ గా మారింది. ఏది ఏమైనా గుంటూరు కారం రిజల్ట్ విషయంలో నాగవంశీ మాత్రం అసలు పొరపాటు జరగలేదని అన్నట్లు గట్టుగానే సమాధానం ఇస్తున్నారు.

ఇక ఈ మూవీలో మహేష్ బాబుకు జోడీగా యంగ్ బ్యూటీ శ్రీలీల నటించింది. హీరో తల్లి పాత్రలో రమ్యకృష్ణ యాక్ట్ చేశారు. పదేళ్ల వయసులో అనుకోకుండా తల్లికి దూరమైన హీరో.. పెద్దయ్యాక విలన్ల అంతు చూసి మళ్లీ మదర్ కు ఎలా దగ్గరయ్యారనేది సినిమా మెయిన్ స్టోరీ లైన్. త్వరలోనే ఈ మూవీ టీవీల్లో ప్రసారం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.