Begin typing your search above and press return to search.

పండగ ట్విస్ట్.. రూమర్స్​కు నాగశౌర్య ఎండ్​ కార్డ్​

గత కొద్ది నెలలుగా హీరో నాగశౌర్య ఇంట్లో విభేదాలు ఉన్నాయంటూ మీడియాలో ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   19 Sep 2023 6:41 AM GMT
పండగ ట్విస్ట్.. రూమర్స్​కు నాగశౌర్య ఎండ్​ కార్డ్​
X

గత కొద్ది నెలలుగా హీరో నాగశౌర్య ఇంట్లో విభేదాలు ఉన్నాయంటూ మీడియాలో ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. నాగశౌర్య పెళ్లై నప్పటి నుంచి తన తల్లి దండ్రులతో(శంకర్ ప్రసాద్​-ఉషాల్ ముల్పూరి) కాస్త దూరంగా ఉంటున్నారని, అందుకే ఇద్దరు వేరుగా కాపురం పెట్టాడని కూడా అన్నారు. అయితే తాజాగా వినాయక చవితి పండగా ఆ వార్తలకు చెక్​ పెట్టింది.

నాగశౌర్యకు అనూష శెట్టి అనే యువతితో పెళ్లి జరిగింది. ఆమె పాపులర్ ఇంటీరియల్ డిజైనర్​, ఆర్కిటెక్​​. అయితే పెళ్లి తర్వాత నుంచి నాగశౌర్యకు తన తల్లిదండ్రులకు మధ్య విభేదాలు వచ్చాయి అంటూ వార్తలు రావడం ప్రారంభమయ్యాయి. అదే సమయంలో శౌర్య తల్లిదండ్రులు కూడా తమ ఫిల్మ్​ ప్రొడక్షన్​లో ఐరా క్రియేషన్స్​లో సినిమాలను నిర్మించడాన్ని తగ్గించేయడం, వేరే బిజినెస్​లపై ఫోకస్ పెట్టడం, అలాగే శౌర్య ఎక్కువగా బయట ప్రొడక్షన్ హౌస్​లో చిత్రాలు చేయడంతో ఈ రూమార్స్​ మరింత ఎక్కువయ్యాయి.

నాగశౌర్య కూడా ఐరా క్రియేషన్స్​ను కాకుండా తన స్నేహితులతో కలిసి కొత్త ప్రొడక్షన్ హౌస్​ పెట్టేందుకు రెడీ అయినట్లు కూడా ప్రచారం సాగింది. అలా ఇవన్నీ కలిసి శౌర్య ఫ్యామిలీపై నెగటివ్ రూమర్స్​ ఎక్కువ స్ప్రెడ్ చేసేశాయి. కానీ తాజాగా వాటన్నింటికీ చెక్ పడింది. వినాయక చవితి పండగ సందర్భంగా నాగశౌర్య, అతడి భార్య, తల్లి దండ్రులతో కలిసి పూజ చేసుకున్నారు. అంతా ఒకే చోట చేరి సందడి చేశారు.

ఈ వేడుకలో శౌర్య తల్లిదండ్రులు మాత్రమే కాదు.. అతడి ఇండస్ట్రీ క్లోజ్ ఫ్రెండ్స్​, జూనియర్ ఎన్టీఆర్​ బావమరిది నార్నే నితిన్​ సహా పలువురు ఈ వేడుకకు హాజరై సరదాగా గడిపారు. వీటికి సంబంధించిన పనులు ఫొటోలు కూడా బయటకు వచ్చి చక్కర్లు కొట్టాయి. ఈ పిక్స్​లో శౌర్య-అనూష దంపతులు.. శౌర్య తల్లిదండ్రలతో కలిసి మెలిసి ఎంతో చూడముచ్చటగా కనిపించారు. దీంతో విభేదాలంటూ వచ్చిన వార్తలకు ఎండ్ కార్డ్ పడింది.

ఇకపోతే శౌర్య తల్లి దండ్రులు మాదాపూర్​లో ఓ కొత్త రెస్టారెంట్ ప్రారంభించబోతున్నారు. 24 సెప్టెంబర్​ అఫీషియల్​గా గ్రాండ్​గా లాంఛ్ కానుంది. ఈ రెస్టారెంట్​ బిజినెస్ సెట్​ అవ్వగానే.. ముందులానే తమ ఐరా క్రియేషన్స్​ బ్యానర్​పై శౌర్యతోనే కాకుండా ఇతర నటీనటులతో కూడా సినిమాలు చేయడం ప్రారంభిస్తారని తెలిసింది.