Begin typing your search above and press return to search.

నాగచైతన్య కోసం.. ముద్దుగుమ్మల పోటీ

ఈ ఇద్దరూ చాలా సహజంగా నటించగలరు. డీ గ్లామర్ రోల్ లో అయినా, మెప్పించగలరు. అందుకే వీరిద్దరిలో ఎవరిని తీసుకుంటే బాగుంటుందా అని చూస్తున్నారట.

By:  Tupaki Desk   |   17 Aug 2023 6:02 AM GMT
నాగచైతన్య కోసం.. ముద్దుగుమ్మల పోటీ
X

అక్కినేని హీరో నాగ చైతన్య మంచి హిట్టు కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఆయన నటించిన కస్టడీ మూవీ డిజాస్టర్ అయ్యింది. కనీసం ఓపెనింగ్స్ కూడా రాలేదు. దీంతో, ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని అనుకుంటన్నారు. అందుకోసం డైరెక్టర్ చందు మొండేటితో చేతులు కలిపారు. వీరిద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా రావడానికి రెడీ అవుతోంది.

ఇది మత్స్యకారుని జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ మూవీ కోసం చైతూ తన కసరత్తులు మొదలుపెట్టారు. రియాల్టీకి దగ్గరగా ఉండాలని, మత్స్యకారుల జీవితం ఎలా ఉంటుంది..? వారు ఎలా ఉంటారు అని తెలుసుకోవడానికి మత్స్యకారుల గ్రామాలకు నాగచైతన్య, చందూ మొండేటి వెళ్లారు. ఈ మూవీ కోసం చైతూ చాలా కష్టపడుతున్నాడు.

కాగా, తాజాగా ఈ మూవీలో హీరోయిన్ ని ఎవరిని తీసుకుంటే బాగుంటుందని చూస్తున్నారట. మొదట ఈ మూవీలో అనుపమను తీసుకోవాలని అనుకున్నారు. కానీ, ఆ తర్వాత కీర్తి సురేష్ పేరు వినపడింది. అయితే, తాజాగా ఇప్పుడు సాయి పల్లవి పేరు వినపడటం గమనార్హం. సాయి పల్లవి, కీర్తి సురేష్ ఈ ఇద్దరిలో ఎవరిని తీసుకుంటే బాగుంటుందని మేకర్స్ ఆలోచిస్తున్నారట.

ఈ ఇద్దరూ చాలా సహజంగా నటించగలరు. డీ గ్లామర్ రోల్ లో అయినా, మెప్పించగలరు. అందుకే వీరిద్దరిలో ఎవరిని తీసుకుంటే బాగుంటుందా అని చూస్తున్నారట. గతంలో నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ లో లవ్ స్టోరీ వచ్చింది. ఈ మూవీ మంచి హిట్ అందుకుంది. ఇక, కీర్తి సురేష్ తో మహానటి సినిమాలో కొద్ది సెకన్ల పాటు స్క్రీన్ పంచుకున్నారు. మరి, చివరకు మేకర్స్ ని ఎవరిని ఒకే చేస్తారో చూడాలి.

మరోవైపు, కార్తికేయ 2 వంటి అద్భుతమైన చిత్రాన్ని అందించిన తర్వాత చందూ మొండేటి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అందుకే ఈ సినిమాని పాన్-ఇండియా స్థాయిలో విడుదల చేయాలని అనుకుంటున్నారట. కాబట్టి గీతా ఆర్ట్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో రూపొందించనుంది.