Begin typing your search above and press return to search.

అర్రే.. చైతూ, శోభిత నిజంగానే కలిసి వెళ్లారా?

అయితే నాగ చైతన్య పోస్ట్ చేసిన క్షణాల్లోనే శోభిత లైక్ కొట్టింది. దీంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉండడం పక్కా అని నెటిజన్లు చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   23 April 2024 3:53 AM GMT
అర్రే.. చైతూ, శోభిత నిజంగానే కలిసి వెళ్లారా?
X

టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య, నటి శోభితా ధూళిపాళ్ల మధ్య ఏదో ఉందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోయిన్ సమంతతో విడాకులు తర్వాత చైతూ.. శోభితతో డేటింగ్ చేస్తున్నారని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి. వీరిద్దరు వెకేషన్ కు కూడా పలుమార్లు కలిసి వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. ఆ మధ్య లండన్ కు వెళ్లిన నాగ చైతన్యతో శోభితా ధూళిపాళ్ల ఫోటోల్లో కనిపించింది.

లండన్ లో ఇండియన్ రెస్టారెంట్ కు వెళ్లిన నాగ చైతన్యతో ఓ చెఫ్ ఫోటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ ఫోటోలో దూరంగా కూర్చుని శోభితా ధూళిపాళ్ల కూడా కనిపించింది. సోషల్ మీడియాలో ఆ పిక్ వైరల్ కావడంతో చెఫ్ తర్వాత డిలీట్ చేశారు. అదే సమయంలో వీరిద్దరూ విదేశాల్లో పక్కపక్కనే నిల్చుని దిగిన ఫోటో కూడా నెట్టింట వైరల్ అయ్యింది. ఈ క్రమంలో చైతూ, శోభిత రిలేషన్ లో ఉన్నారనే అనుమానాలు బలపడ్డాయి.

తాజాగా మరోసారి వీరిద్దరూ కలిసి వెకేషన్ కు వెళ్లారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల నాగ చైతన్య సోషల్ మీడియాలో కూల్ ఫోటో పోస్ట్ చేశారు. అందులో చైతూ.. సూర్యాస్తమయాన్ని ఆస్వాదిస్తున్నట్లు కనిపిస్తున్నారు. అయితే నాగ చైతన్య పోస్ట్ చేసిన క్షణాల్లోనే శోభిత లైక్ కొట్టింది. దీంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉండడం పక్కా అని నెటిజన్లు చెబుతున్నారు. ఆ ఫోటో శోభితే తీసి ఉంటుందని, ఇద్దరూ కలిసి వెకేషన్ కు వెళ్లారని అంటున్నారు.

ఇప్పుడు దీనిపై మరింత క్లారిటీ ఇస్తున్నారు. శోభిత ఇటీవల వైల్డ్ లైఫ్ సఫారీకి వెళ్లినట్లు రెండు రోజుల క్రితం ఫోటోలు పోస్ట్ చేసింది. చైతూ పోస్ట్ చేసిన పిక్ కూడా సఫారీ చేస్తుండగా తీసినట్లు అనిపిస్తోంది. దీంతో ఈ రెండు ఫోటోలు మిక్స్ చేసి నెట్టింట పోస్ట్ చేస్తున్నారు నెటిజన్లు. మహారాష్ట్రలోని వైల్డ్ లైఫ్ రిసార్ట్ కు ఇద్దరూ కలిసి వెళ్లినట్లు చెబుతున్నారు. హాలీడే ట్రిప్ లో భాగంగా వెళ్లినట్లు ఉన్నారని అంటున్నారు.

ప్రస్తుతం తండేల్ మూవీ చేస్తున్నారు నాగ చైతన్య. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా.. ఉత్తరాంధ్రకు చెందిన మత్స్యకారుల నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది. అయితే ఈ మూవీ షూటింగ్ కు చిన్న బ్రేక్ ఇచ్చిన చైతూ.. తన తమ్ముడు, హీరో అక్కినేని అఖిల్ బర్త్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొనేందుకు దుబాయ్ వెళ్లి ఇటీవల హైదరాబాద్ వచ్చారు. ఆ తర్వాత శోభితతో వెకేషన్ కు వెళ్లినట్లు టాక్ వినిపిస్తోంది. మరి ఇందులో నిజమంతనేది తెలియదు.