Begin typing your search above and press return to search.

10 రోజులు మైసూర్ లో..రేయింబ‌వ‌ళ్లు గేమ్ ఛేంజ‌ర్!

ఏక కాలంలో `భార‌తీయుడు -2` చిత్రీక‌ర‌ణ కూడా జ‌ర‌గడంతో శంక‌ర్ రెండిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ల‌డంతో! డిలే త‌ప్ప‌లేదు.

By:  Tupaki Desk   |   25 Nov 2023 6:17 AM GMT
10 రోజులు మైసూర్ లో..రేయింబ‌వ‌ళ్లు గేమ్ ఛేంజ‌ర్!
X

`గేమ్ ఛేంజ‌ర్` షూటింగ్ న‌త్త‌న‌డ‌క‌న సాగుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి కావాల్సిన సినిమా ఇంకా సెట్స్ లో నే ఉంది. అందుకు కార‌ణాలు అనేకం. ఏక కాలంలో `భార‌తీయుడు -2` చిత్రీక‌ర‌ణ కూడా జ‌ర‌గడంతో శంక‌ర్ రెండిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ల‌డంతో! డిలే త‌ప్ప‌లేదు. మూడు రోజుల క్రితం వ‌ర‌కూ శంక‌ర్ `భార‌తీయుడు-2` సెట్స్ లోనే ఉన్నారు. విజ‌య‌వాడ‌లో కీల‌క యాక్ష‌న్ స‌న్నివేశాలు కొన్నింటిని చిత్రీక‌రించారు.

తాజాగా క‌మ‌ల్ హాస‌న్ కి విశ్రాంతి ఇచ్చి మ‌ళ్లీ రామ్ చ‌ర‌ణ్ ని సెట్స్ కి పిలిచారు. నిన్న‌టి రోజున చ‌ర‌ణ్ మైసూర్ చేరుకున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం అక్క‌డ షూటింగ్ జ‌రుగుతోంది. తాజాగా సెట్స్ నుంచి మ‌రిన్ని విష‌యాలు లీక‌య్యాయి. ప‌దిరోజుల పాటు ఏక‌ధాటిగా మైసూర్ లోనే షూటింగ్ జ‌రుగుతుంది. ప్ర‌స్తుతం చ‌ర‌ణ్‌..సునీల్ పై శంక‌ర్ కీల‌క స‌న్నివేశాలుచిత్రీక‌రిస్తున్న‌ట్లు తెలిసింది.

ప‌దిరోజులే షూటింగ్ కి కేటాయించ‌డంతో రేయింబ‌వ‌ళ్లు షూటింగ్ చేస్తున్నారుట‌. రాత్రిపూట చిత్రీక‌ర‌ణ‌కు ఆటంకాలు కూడా త‌క్కువ‌గా ఉండ‌టంతో చ‌కాచ‌కా పూర్తిచేస్తున్నారుట‌. అయితే అవి నైట్ ఎఫెక్ట్ కి సంబంధించిన స‌న్నివేశాలా? లేక డే అంతా షూటింగ్ చేసినా స‌మ‌యాభావంతో రాత్రిపూట కూడా చేస్తున్నారా? అన్నది క్లారిటీ లేదు. కానీ డే షూట్ క‌న్నా నైట్ షూట్ బాగా వ‌స్తుంద‌ని లీకులందు తున్నాయి.

మొత్తానికి మైసూర్ షూట్ వేగంగానే జ‌రుగుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇందులో రామ్ చ‌ర‌ణ్ కి జోడీగా కియారా అద్వాణీ న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే కియారాపై కొన్ని కీలక స‌న్నివేశాలు చిత్రీక‌రించారు. మ‌రి మైసూర్ షూట్ లో ఆమెకేమైనా స‌న్నివేశాలున్నాయా? లేదా? అన్న‌ది తెలియాల్సి ఉంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తోన్న సంగ‌తి తెలిసిందే.