Begin typing your search above and press return to search.

కీర్తి పీక పట్టుకున్న చిరు.. అసలు విషయం ఏంటంటే!

మెగాస్టార్ చిరంజీవి తమన్నా జంటగా మెహర్‌ రమేష్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం భోళా శంకర్‌

By:  Tupaki Desk   |   7 Aug 2023 6:14 AM GMT
కీర్తి పీక పట్టుకున్న చిరు.. అసలు విషయం ఏంటంటే!
X

మెగాస్టార్ చిరంజీవి, తమన్నా జంటగా మెహర్‌ రమేష్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'భోళా శంకర్‌'. సినిమా ప్రమోషన్ లో భాగంగా చిరు లీక్స్ అంటూ ఓ మేకింగ్‌ వీడియోను చిరంజీవి సోషల్‌ మీడియా ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. వీడియో అందరికి కూడా కన్నుల విందు చేసింది. ఆ వీడియో లో పలువురు స్టార్స్ కనిపించడంతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది అనడంలో సందేహం లేదు.

భోళా శంకర్‌ మేకింగ్ వీడియోలో చిరంజీవి చాలా యాక్టివ్ గా కనిపించారు. అంతే కాకుండా ఒక షాట్‌ లో కీర్తి సురేష్ పీక పట్టుకోవడం కనిపించింది. అది సరదాగానే అయినా కూడా ఎందుకు చిరు అలా చేశాడా అంటూ చాలా మందిలో ఆసక్తి క్రియేట్‌ అయింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో చిరంజీవి ఆ విషయాన్ని క్లారిటీ ఇచ్చాడు.

చిరంజీవి మాట్లాడుతూ... కీర్తి సురేష్‌ కోసం మా ఇంట్లో ఉన్న తమిళ వంట మనిషి ప్రత్యేకమైన వంటలు చేసేవాడు. అతడితో కీర్తి కావాల్సిన భోజనం వండించుకునేది. మా ఇంటి నుండి ప్రతి రోజు కూడా చాలా వెరైటీలు వచ్చేవి. తినేది తక్కువే అయినా కూడా ప్రతీది కూడా ఎంజాయ్‌ చేస్తూ తినడం కీర్తి సురేష్ అలవాటు.

కొన్ని సార్లు నాకు పలానా వంటకం కావాలని మరీ డిమాండ్ చేసి తెప్పించుకునేది. ఒక రోజు నేను ఏదో సీరియస్ వర్క్ లో ఉండగా నా దగ్గరకు వచ్చి ఈ రోజు మెను ఏంటి అంటూ అడిగింది. దాంతో సరదాగా ఆమె గొంతు పట్టుకున్నాను. ఆ సందర్భంలో తీసిందే అన్నట్లుగా మెగాస్టార్ చెప్పుకొచ్చాడు.

ఈ సినిమాలో కీర్తి సురేష్ కి అన్నయ్య గా చిరంజీవి నటించాడు. అయితే భవిష్యత్తులో ఆమెతో కలిసి రొమాన్స్ చేయాలని కోరుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చాడు. అందుకే నన్ను అన్నయ్య గా ఫిక్స్ అవ్వద్దు అని చెప్పాను అంటూ చిరంజీవి తాజా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సరదాగా వ్యాఖ్యలు చేశాడు.