Begin typing your search above and press return to search.

మెగా హీరోల బాలీవుడ్ దెబ్బలు.. మరోసారి రెడీ!

టాలీవుడ్ లో చక్రం తిప్పుతున్న మెగా హీరోలు బాలీవుడ్ ఇండస్ట్రీపై పెద్దగా ఫోకస్ చేయలేదు. మెగాస్టార్ చిరంజీవి హిందీలో 1990లో ప్రతిబంద్ అనే మూవీ చేశాడు

By:  Tupaki Desk   |   13 March 2024 3:30 AM GMT
మెగా హీరోల బాలీవుడ్ దెబ్బలు.. మరోసారి రెడీ!
X

టాలీవుడ్ లో చక్రం తిప్పుతున్న మెగా హీరోలు బాలీవుడ్ ఇండస్ట్రీపై పెద్దగా ఫోకస్ చేయలేదు. మెగాస్టార్ చిరంజీవి హిందీలో 1990లో ప్రతిబంద్ అనే మూవీ చేశాడు. ఈ మూవీ హిట్ అయ్యింది. రాజశేఖర్ అంకుశం రీమేక్ గా ఈ సినిమా హిందీలో తెరకెక్కింది. అలాగే గ్యాంగ్ లీడర్ ని ఆజ్ కా గుండా రాజ్ పేరుతో హిందీలో రీమేక్ చేశారు. ఆ మూవీ కూడా హిట్ అయ్యింది.

తరువాత తమిళ్ సూపర్ హిట్ మూవీ జెంటిల్మెన్ సినిమాని హిందీలో చిరంజీవి హీరోగా రీమేక్ చేశారు. ఈ మూవీ పర్వాలేదనే టాక్ తెచ్చుకుంది. మళ్ళీ బాలీవుడ్ లో చిరంజీవి సినిమాలు చేయలేదు. అవకాశాలు వచ్చిన వదిలేసుకున్నాడు. మెగాస్టార్ రాజకీయాల నుంచి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత చేసిన సైరా నరసింహారెడ్డి పాన్ ఇండియా భాషలలో రిలీజ్ చేశారు.

హిందీలో ఈ మూవీ పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. మెగాస్టార్ తర్వాత మెగా ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్ హిందీలో జంజీర్ అనే సినిమా చేశాడు. ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. చరణ్ ఇమేజ్ ని కూడా డ్యామేజ్ చేసింది. అయితే ఆర్ఆర్ఆర్ మాత్రం సూపర్ హిట్ కావడంతో చెర్రీ బ్రాండ్ ఇమేజ్ ఒక్కసారిగా బాలీవుడ్ లో పెరిగిపోయింది.

ప్రస్తుతం గేమ్ చేంజర్ తో రామ్ చరణ్ సోలోగా బాలీవుడ్ మార్కెట్ లో తన అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. రాబోయే ప్రాజెక్టులు ఇక పాన్ ఇండియా రేంజ్ లో ఉంటాయని చెప్పవచ్చు. అయితే ముందుగా గేమ్ ఛేంజర్ హిట్ అయితే బాలీవుడ్ లో రామ్ చరణ్ మార్కెట్ పెరిగే అవకాశం ఉంది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గతంలో సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ తెలుగుతో పాటు హిందీలో కూడా రిలీజ్ చేశారు. ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడు సుజిత్ దర్శకత్వంలో ఓజీ మూవీతో మరోసారి తన అదృష్టం పరీక్షించుకుంటున్నారు.

వరుణ్ తేజ్ తాజాగా ఆపరేషన్ వాలంటైన్ సినిమాని హిందీలో కూడా ఒకేసారి రిలీజ్ చేశాడు. ప్రమోషన్స్ కూడా ప్రత్యేకంగానే చేసిన వరుణ్ అక్కడ వరుస ఇంటర్వ్యూలు ఇచ్చాడు. అయితే ఈ మూవీ అక్కడి ఆడియన్స్ కి పెద్దగా కనెక్ట్ కాలేదు. ఇప్పుడు మట్కా మూవీతో మరోసారి పాన్ ఇండియా స్థాయిలో చేస్తూ సత్తా చాటాలని అనుకుంటున్నాడు. ఈ సినిమాలో వరుణ్ మూడు విభిన్నమైన లుక్స్ తో కనిపించబోతున్నాడు.

అలాగే మెగాస్టార్ చిరంజీవి విశ్వంభరతో తన స్టామినాని ప్రూవ్ చేసుకునే పనిలో ఉన్నారు. ఈ సినిమా సైరా తరహాలో కాకుండా ఫాంటసీ అడ్వెంచర్ గా రానుంది. కాబట్టి నార్త్ ఆడియెన్స్ కు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి తప్పకుండా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. మరి ఈ సారైనా మెగా హీరోలకి బాలీవుడ్ లో సక్సెస్ లు వస్తాయేమో చూడాలి.