Begin typing your search above and press return to search.

గడ్డ కట్టే చలిలో మెగా కపుల్ వాలెంటైన్స్ డే!

ఇప్పుడు ప్రేమికుల రోజు సందర్భంగా ఈ జంట కాశ్మీర్‌లోని గడ్డ కట్టే చల్లటి వాతావరణంలో ఎంజాయ్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

By:  Tupaki Desk   |   14 Feb 2024 11:58 AM GMT
గడ్డ కట్టే చలిలో మెగా కపుల్ వాలెంటైన్స్ డే!
X

గడ్డ కట్టే చలిలో వాలెంటైన్స్ డే ని సెలబ్రేట్ చేసుకున్నారు నూతన వధూవరులు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి. గత కొన్నేళ్లుగా ప్రేమాయణం సాగిస్తున్న ఈ జంట.. గతేడాది నవంబర్ లో మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఇటలీలోని టుస్కానీలో వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ జరిగింది. అప్పటి నుంచీ వైవాహిక బంధంలోని ప్రతీ క్షణాన్ని ఆస్వాదిస్తున్న మెగా కపుల్.. పెళ్ళి తర్వాత హనీమూన్ కోసం ఫిన్లాండ్‌ వెళ్ళారు. ఇప్పుడు ప్రేమికుల రోజు సందర్భంగా ఈ జంట కాశ్మీర్‌లోని గడ్డ కట్టే చల్లటి వాతావరణంలో ఎంజాయ్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది.


మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ 'ఆపరేషన్ వాలెంటైన్'. శక్తి ప్రతాప్‌ సింగ్‌ హడా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా సినిమా వచ్చే నెల మొదటి వారంలో విడుదల కాబోతోంది. ఈ నేపధ్యంలో వరుణ్ తన సినిమాని దూకుడుగా ప్రమోట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా హీరోయిన్ మానుషి చిల్లర్‌ తో కలిసి కాశ్మీర్ కు వెళ్లారు. ఈరోజు (ఫిబ్రవరి 14) లేత్‌ పోరా శిబిరంలోని పుల్వామా స్మారక స్థలాన్ని సందర్శించి, అమరవీరులకు నివాళులు అర్పించారు.


అయితే 'ఆపరేషన్ వాలెంటైన్' ప్రచార కార్యక్రమాల్లో భాగంగా కాశ్మీర్ వెళ్లిన వరుణ్ తేజ్.. పనిలో పనిగా తన బెటర్ హాఫ్ లావణ్య త్రిపాఠిని కూడా వెంట తీసుకెళ్లారు. అక్కడ 0-డిగ్రీల ఉష్ణోగ్రతలో వాలెంటైన్స్ డేను సెలబ్రేట్ చేసుకున్నారు. ఇది వారి ప్రేమకథకు ప్రత్యేకమైన ఆకర్షణను జోడిస్తుందని భావించవచ్చు. ఇక కాశ్మీర్ ట్రిప్ కు సంబంధించిన విషయాలను ఫోటోలు, వీడియోల రూపంలో లావణ్య తన ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంటోంది.


పెళ్ళి తర్వాత లావణ్య 'మిస్ పర్ఫెక్ట్' అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హాట్‌ స్టార్‌ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ కు ఆడియన్స్ ను. మంచి రెస్పాన్స్ వస్తోంది. మరోవైపు వరుణ్ తేజ్ సైతం 'ఆపరేషన్ వాలెంటైన్' సినిమాతో సూపర్ హిట్ అందుకుంటారని ధీమాగా ఉన్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ ఆకట్టుకుంది. మార్చి 1న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కాబోతోంది.


దేశంలోని వైమానిక దళ వీరుల అలుపెరుగని పోరాటాన్ని.. దేశాన్ని రక్షించడంలో వాళ్లు ఎదుర్కొనే సవాళ్లను 'ఆపరేషన్ వాలెంటైన్' చిత్రంలో చూపించనున్నారు. ఇందులో వరుణ్ తేజ్ ఎయిర్ ఫోర్స్ పైలట్ గా కనిపించనున్నారు. మానుషి చిల్లర్ రాడార్ ఆఫీసర్ పాత్ర పోషించిన ఈ సినిమా రుహానీ శర్మ మరో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రొడక్షన్స్‌, గాడ్‌ బ్లెస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, రినైసన్స్‌ పిక్చర్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. మిక్కీ జె మేయర్‌ సంగీతం సమకూర్చారు.