Begin typing your search above and press return to search.

మంజుమ్మ‌ల్ బాయ్స్.. 2 రోజుల్లో లక్ష మంది!

ప్రముఖ టికెట్ సెల్లింగ్ వెబ్ సైట్ బుక్ మై షోలో ఈ సినిమాకు తొలి రోజు రూ.34 వేల టికెట్లు అమ్ముడవ్వగా.. రెండు రోజులు కలిపి లక్షకుపైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయి.

By:  Tupaki Desk   |   8 April 2024 8:39 AM GMT
మంజుమ్మ‌ల్ బాయ్స్.. 2 రోజుల్లో లక్ష మంది!
X

మంజుమ్మ‌ల్ బాయ్స్ మూవీ టాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. రూ.20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్.. ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా రూ.230 కోట్లకు పైగా వ‌సూళ్లు రాబట్టింది. మాలీవుడ్ హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డు క్రియేట్ చేసింది. ఇంకా ఎన్నో సంచలనాలు సృష్టించింది. 2006లో గుణ కేవ్స్ లో చిక్కుకున్న త‌మ మిత్రుడ్ని ర‌క్షించుకునేందుకు ఎర్నాకులం మంజుమ్మ‌ల్ బాయ్స్ చేసిన సాహసాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు మేకర్స్.

మాలీవుడ్ డైరెక్టర్ చిదంబరం ఎస్‌ పొదువల్‌ అద్భుతంగా తెరకెక్కించిన ఈ సినిమాను అదే పేరుతో టాలీవుడ్ లో మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్ రైటింగ్స్, ప్రైమ్‌ షో ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 6వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం అదరగొడుతోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ భారీ వసూళ్లతో దూసుకుపోతోంది.

ఇప్పటికే మాలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం ప్రేమలు తెలుగు వెర్షన్ క్రియేట్ చేసిన రికార్డును బద్దలకొట్టింది మంజుమ్మల్ బాయ్స్. తొలి రోజు అత్యధిక టిక్కెట్లు అమ్ముడుపోయిన మలయాళ డబ్బింగ్ మూవీగా నిలిచింది. ప్రేమలు కన్నా మూడు రెట్లు ఎక్కువగా ఈ మూవీ టికెట్లు అమ్ముడయ్యాయి. ఇక రెండో రోజు ఆదివారం అనేక చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపించాయి. ఫస్ట్ డే కన్నా రెండో రోజు రెట్టింపు వసూళ్లను రాబట్టిందీ చిత్రం.

ప్రముఖ టికెట్ సెల్లింగ్ వెబ్ సైట్ బుక్ మై షోలో ఈ సినిమాకు తొలి రోజు రూ.34 వేల టికెట్లు అమ్ముడవ్వగా.. రెండు రోజులు కలిపి లక్షకుపైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయి. పలు చోట్ల డిమాండ్‌ ఎక్కువగా ఉండటంతో మల్టీప్లెక్స్‌ ల్లో ఎక్స్ ట్రా షోలు వేస్తున్నారు. దీని బట్టి చూస్తుంటే.. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నట్లు అర్ధమవుతోంది. మరో రెండు వారాల పాటు ఈ మూవీ వసూళ్లు తగ్గవని ట్రేడ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

తెలుగులో ఈ సినిమాకు భారీ వసూళ్లు వస్తుండడంతో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఫుల్ హ్యాపీ గా ఉంది. ఈ మూవీలో సౌబిన్‌ షాహిర్‌, గణపతి, ఖలీద్‌ రెహమాన్‌, శ్రీనాథ్‌ భాసి కీలక పాత్రల్లో నటించారు. పరవ ఫిల్మ్స్ బ్యానర్ పై బాబు షాహిర్, సౌబిన్ షాహిర్, షాన్‌ ఆంటోని నిర్మించిన ఈ చిత్రం.. కోలీవుడ్ లో కూడా మంచి విజయం సాధించింది. మరి ఫ్యూచర్ లో ఈ సినిమా ఇంకా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.