సెట్ లో గరిట తిప్పిన హీరోలు!
మనోజ్-రోహిత్- సాయి శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'భైరవం' రిలీజ్ కి రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రచారం పనులు వేగంగా జరుగుతున్నాయి.
By: Tupaki Desk | 20 May 2025 7:06 AMహీరోయిన్లకు ప్రభాస్ మంచి వంటకాలు పంపిస్తుంటాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ అయితే అతిధులకు స్వయంగా బిర్యానీ వండి రుచి చూపించడం అలవాటు. రామ్ చరణ్ అమ్మ కోసం గరిట పడతాడు. చిరం జీవి తన తల్లి కోసం వంటకాలు వండటం అన్నది ఓ హాబీ. ఆన్ సెట్స్ లోనూ అప్పుడప్పుడు ఇలాంటి సన్నివేశాలు చోటు చేసుకుంటాయి. అయితే మంచు మనోజ్-నారా రోహిత్ మాత్రం ఇద్దరు గరిట తిప్పి తమ చేతి వాటం చూపించినట్లు తెలుస్తోంది.
మనోజ్-రోహిత్- సాయి శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'భైరవం' రిలీజ్ కి రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రచారం పనులు వేగంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా మనోజ్ ఆన్ సెట్స్ విషయాలు పంచుకున్నాడు. ఆవేంటో ఆయన మాటల్లోనే.. శ్రీనివాస్ తమ్ముడితో సమానం. రోహిత్ చాలా కాలంగా మంచి స్నేహితుడు. 'భైరవం' కారణంగా మా మధ్యస్నేహం మరింత బలపడింది.
షూటింగ్ లో సమయం దొరికిందంటే మంచి వంటగాళ్లం అయ్యేవాళ్లం. రోహిత్ మంచి వంటకాలు చేస్తాడు. నేను కూడా చాలా హాస్టల్స్ లో ఉన్నాను. కాబట్టి గరిట తిప్పడం నాకు అలవాటుగా మారింది. అలా ఇద్దరం కలిసి చాలా వంటకాలు సెట్స్ లో చేసాం. అలా రుచుల్ని ఆస్వాదిస్తూ షూటింగ్ పూర్తి చేసాం. సినిమాలో గజపతి అనే పాత్రలో కనిపిస్తా. ఇప్పటివరకూ ఇలాంటి రోల్ పోషించలేదు. నా కెరీర్ లో స్పెషల్ గా మిగిలిపోతుంది.
మాతృక `గరుడన్` చూసిన వాళ్లు కూడా మా సినిమా చూసి ఆశ్చర్యపోయారు. పేరుకే రీమేక్ . కానీ చాలా కొత్తగా ఉంటుంది. తెలుగు ఆడియన్స్ కి కొత్త అనుభూతినిస్తుందని నమ్మకంగా చెప్పగలను అన్నారు. మనోజ్ నటుడిగా చాలా కాలంపాటు గ్యాప్ తీసుకున్న సంగతి తెలిసిందే. కొన్ని కారణాలతో ఆయన జీవితంలో చాలా మార్పులొచ్చాయి. కంబ్యాక్లో మాత్రం స్ట్రాంగ్ గా ప్లాన్ చేసుకున్నట్లు తెలిపాడు.