Begin typing your search above and press return to search.

ఆ విష‌యం విష్ణునే అడ‌గాలి

మంచు విష్ణు త‌న డ్రీమ్ ప్రాజెక్టు అని చెప్పుకుంటున్న క‌న్న‌ప్ప సినిమాలో త‌న తండ్రి మోహ‌న్ బాబుతో పాటూ త‌న ముగ్గురు పిల్ల‌లు కూడా న‌టిస్తున్నారు...

By:  Tupaki Desk   |   9 Jun 2025 10:10 AM
ఆ విష‌యం విష్ణునే అడ‌గాలి
X

మంచు విష్ణు త‌న డ్రీమ్ ప్రాజెక్టు అని చెప్పుకుంటున్న క‌న్న‌ప్ప సినిమాలో త‌న తండ్రి మోహ‌న్ బాబుతో పాటూ త‌న ముగ్గురు పిల్ల‌లు కూడా న‌టిస్తున్నారు. అయితే త‌న డ్రీమ్ సినిమాలో తండ్రీ, పిల్లల‌ను భాగం చేసిన విష్ణు.. మ‌నోజ్, ల‌క్ష్మి ల‌ను మాత్రం దూరం పెట్టాడు. అయితే క‌న్న‌ప్ప‌లో మ‌నోజ్ ను ఎందుకు దూరం పెట్టాడ‌నేది ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.

మ‌రి మంచు ల‌క్ష్మిని క‌న్న‌ప్ప‌లో ఎందుకు భాగం చేయ‌లేద‌నేది అంద‌రికీ చాలా రోజులుగా వ‌స్తున్న ప్ర‌శ్న‌. ల‌క్ష్మి మ‌నోజ్ కు స‌పోర్ట్ చేస్తుంద‌నే కార‌ణంతోనే ఆమెను కూడా క‌న్న‌ప్పకు దూరం పెట్టారేమో అని చాలా మంది అనుకున్నారు. కానీ ఈ విష‌యంలో ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి క్లారిటీ మాత్రం లేదు. రీసెంట్ గా ఓ సంద‌ర్భంగా హైద‌రాబాద్ కు వ‌చ్చిన ల‌క్ష్మికి ఇదే ప్ర‌శ్న ఎదురైంది.

క‌న్న‌ప్పలో తాను ఎందుకు లేను అని అడ‌గ్గా, ఈ విష‌యాన్ని త‌న‌ను కాకుండా విష్ణుని అడ‌గాల‌ని, బ‌హుశా సినిమాలో త‌ను న‌టిస్తే ఇంకెవ‌రూ క‌నిపించ‌ర‌నే ఉద్దేశంతో కాబోలు అంటూ చ‌మ‌త్క‌రించింది. వాస్త‌వానికి ఇంత భారీగా తెర‌కెక్కుతున్న‌ క‌న్నప్ప సినిమాలో మంచు ల‌క్ష్మికి ఏదేనా పాత్ర ఇవ్వాల‌ని అటు విష్ణు కానీ, ఇటు మోహ‌న్ బాబు కానీ అనుకుంటే అది పెద్ద విష‌య‌మేమీ కాదు.

అయిన‌ప్ప‌టికీ ల‌క్ష్మిని క‌న్న‌ప్ప‌లో భాగం చేయ‌లేదంటే లోప‌లేదో జ‌రుగుతుంద‌ని అర్థ‌మ‌వుతుంది. దానికి తోడు ఇప్పుడు మంచు ల‌క్ష్మి కూడా ఆ విష‌యాన్ని విష్ణునే అడ‌గ‌మ‌ని చెబుతోంది. ఏదేమైనా ఈ విష‌యంలో విష్ణు ఏదొక‌టి చెప్తే కానీ క్లారిటీ రాదు. ఇదిలా ఉంటే మంచు ల‌క్ష్మి గ‌త కొంత కాలంగా ముంబైలోనే నివాసం ఉంటున్న సంగ‌తి తెలిసిందే.

క‌ర‌ణ్ జోహార్ నిర్వ‌హిస్తున్న ది ట్ర‌యేట‌ర్స్ అనే రియాలిటీ షో లో పాల్గొనేందుకు రెడీ అవుతున్న ల‌క్ష్మి ఏదైనా ప‌నుంటే త‌ప్ప హైద‌రాబాద్ కు రావ‌డం లేదు. ఇక క‌న్న‌ప్ప విష‌యానికొస్తే జూన్ 27న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. ఇప్ప‌టికే పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు కూడా పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ గా ఉన్న విష్ణు ఈ సినిమాపై చాలా ఆశ‌లు పెట్టుకున్నాడు. ముఖేష్ కుమార్ సింగ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాలో ప్ర‌భాస్, అక్ష‌య్ కుమార్, మోహ‌న్ లాల్, శ‌రత్ కుమ‌ర్, కాజ‌ల్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.