Begin typing your search above and press return to search.

రాజమౌళి ఆధీనంలో మహేష్.. ఇది మొదటి ప్లానా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల గుంటూరు కారం సినిమాతో పర్వాలేదు అనిపించాడు

By:  Tupaki Desk   |   18 Jan 2024 11:34 AM GMT
రాజమౌళి ఆధీనంలో మహేష్.. ఇది మొదటి ప్లానా?
X

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల గుంటూరు కారం సినిమాతో పర్వాలేదు అనిపించాడు. పూర్తిస్థాయిలో ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది కానీ మహేష్ క్యారెక్టర్ మాత్రం బాగానే హైలెట్ అయ్యింది. ఇక మహేష్ తదుపరి సినిమా మాత్రం ఊహించని స్థాయిలో ఉండబోతోంది. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ తన 29వ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ ప్రాజెక్టుపై ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు.

అఫీషియల్ గా సినిమా చేస్తున్నామని రాజమౌళి అప్పుడెప్పుడో రెండేళ్ల క్రితం తెలియజేశారు. ఇక ఆ తర్వాత ఆయన తండ్రి కథ రచయిత విజయేంద్ర ప్రసాద్ మహేష్ బాబుతో ఫారెస్ట్ అడ్వెంచర్ కథ చేయబోతున్నట్లుగా ఒక హింట్ అయితే ఇచ్చారు. ఇక రాజమౌళి ఆ తర్వాత ఆ విషయంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లోనే బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.

రాజమౌళి సాధారణంగా పూర్తిస్థాయిలో స్క్రిప్టు సిద్ధమైతే గానే ప్రాజెక్టును సీట్స్ పైకి తీసుకువెళ్లడు. అంతేకాకుండా ప్రత్యేకంగా వర్క్ షాప్ కూడా నిర్వహించాల్సి ఉంటుంది. ఇక మహేష్ బాబుతో దాదాపు 1500 కోట్లతో భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నట్లు ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్. కాబట్టి ప్రణాళికలు ఏ విధంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే గుంటూరు కారం హడావిడి ముగిసిన తర్వాత మహేష్ బాబు సైలెంట్ గా జర్మనీ వెళ్లడం హాట్ టాపిక్ గా మారిపోయింది.

సాధారణంగా మహేష్ ఏదైనా సినిమా షూటింగ్ అయిపోతే తన ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్లి అక్కడే కొన్ని రోజులు హాలిడేస్ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అయితే ఈసారి మాత్రం మహేష్ ఒంటరిగానే జర్మనీ ట్రిప్ ప్లాన్ చేయడం వెనుక రాజమౌళి హస్తం ఉంది అనేది మరొక టాక్. ఎందుకంటే రాజమౌళి మహేష్ సినిమా హై విజువల్ గ్రాఫిక్స్ తో రాబోతోంది.

సరికొత్త సినిమా టెక్నాలజీని ఈ సినిమా కోసం ఉపయోగించబోతున్నట్లు సమాచారం. ఒక విధంగా చెప్పాలి అంటే హాలీవుడ్ రేంజ్ ను టచ్ చేసేలా జక్కన్న స్ట్రాంగ్ ప్లాన్ వేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే అత్యాధునిక సాంకేతికత మరియు వివిధ సినిమా అంశాలలో నైపుణ్యానికి పేరుగాంచిన జర్మనీలోనే మహేష్ ముందుగానే కొంత ప్రిపేర్ అవుతున్నట్లు టాక్. మహేష్ ఇంకాస్త లోతుగా టెక్నాలజీని అర్థం చేసుకుంటే బాగుంటుందని రాజమౌళి పంపించారట.

అక్కడే కొన్ని రోజులు పాటు రాజమౌళి మహేష్ బాబు అలాగే సినిమాలో కీలకంగా ఉండే టెక్నీషియన్స్ తో వర్క్ షాప్ నిర్వహించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. పూర్తిస్థాయిలో టెక్నాలజీని అర్థం చేసుకొని సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాలి అని రాజమౌళి ఆలోచిస్తున్నాడు. ఇక దర్శకుడు ఏది చెబితే అది తూచా తప్పకుండా చేసే మహేష్ బాబు జక్కన్న ప్రాజెక్టుకు లైఫ్ ఇస్తాడు అనడంలో సందేహం లేదు. తప్పకుండా ఈ కాంబినేషన్ మాత్రం నెవ్వర్ బిఫోర్ అనేలా ఉండబోతుంది అని అర్థమవుతుంది. చూడాలి మరి సినిమాకు సంబంధించిన ఫస్ట్ అప్డేట్ ఎలా ఉంటుందో.