Begin typing your search above and press return to search.

మిర్చి యార్డ్‌ లో మహేష్‌ ఏం చేస్తున్నాడు..!

సూపర్ స్టార్‌ మహేష్ బాబు, త్రివిక్రమ్‌ కాంబినేషన్ లో రూపొందుతున్న గుంటూరు కారం సినిమా షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుంది.

By:  Tupaki Desk   |   18 Nov 2023 7:46 AM GMT
మిర్చి యార్డ్‌ లో మహేష్‌ ఏం చేస్తున్నాడు..!
X

సూపర్ స్టార్‌ మహేష్ బాబు, త్రివిక్రమ్‌ కాంబినేషన్ లో రూపొందుతున్న గుంటూరు కారం సినిమా షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌ సిటీ లో వేసిన మిర్చి మార్కెట్ యార్డ్‌ సెట్‌ లో షూటింగ్‌ నిర్వహిస్తున్నారు. శేఖర్ మాస్టర్‌ ఆధ్వర్యంలో పాట చిత్రీకరణ జరుపుతున్నట్లుగా సమాచారం అందుతోంది.

మహేష్ బాబు తో పాటు పదుల సంఖ్యలో డాన్సర్స్ ఇంకా భారీ టెక్నీషియన్స్ తో ఈ సినిమా షూటింగ్‌ ను నిర్వహిస్తున్నట్లుగా మేకర్స్ తెలుస్తోంది. మహేష్ బాబు పై టైటిల్‌ సాంగ్ చిత్రీకరించాల్సి ఉందని ఇటీవల మేకర్స్ ప్రకటించారు. పైగా మిర్చీ మార్కెట్ యార్డ్‌ లో షూటింగ్ కనుక దమ్ మసాలా పాట చిత్రీకరిస్తూ ఉంటారని సమాచారం అందుతోంది.

ఈ సినిమాలో మహేష్‌ బాబుకు జోడీగా శ్రీలీల నటిస్తోంది. మరో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటిస్తోంది. ప్రస్తుతం చిత్రీకరిస్తున్న పాట తర్వాత మహేష్ బాబు మరియు శ్రీలీల పై విదేశాల్లో రెండు పాటల చిత్రీకరణ జరపాల్సి ఉంటుందని సమాచారం అందుతోంది.

మొత్తానికి గుంటూరు కారం సినిమా షూటింగ్‌ స్పీడ్ చూస్తూ ఉంటే సంక్రాంతికి విడుదల విషయంలో ఎలాంటి అనుమానాలు లేవు అని తేలిపోయింది. మీడియా సర్కిల్స్ నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ ను డిసెంబర్‌ రెండో లేదా మూడవ వారంలో ముగించాలని భావిస్తున్నారట. కొత్త సంవత్సరం వేడుకల కోసం విదేశాలకు ఫ్యామిలీ తో వెళ్లే మహేష్ బాబు జనవరి రెండో వారంలో ఇండియాకు తిరిగి వచ్చి గుంటూరు కారం సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి.