Begin typing your search above and press return to search.

మహేష్ తో మరోసారి కబడ్డీ పట్టు

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ ని తెరమీద చూసి చాలా కాలమే అవుతోంది. ఆయన చివరగా సర్కారు వారి పాట సినిమాతో 2022లో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ మూవీ పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో ఫ్యాన్స్ చాలా నిరాశకు గురయ్యారు. దీంతో, మహేష్ తదుపరి చిత్రం గుంటూరు కారం పైనే అందరూ ఆశలు పెట్టుకున్నారు.

By:  Tupaki Desk   |   15 July 2023 6:28 AM GMT
మహేష్ తో మరోసారి కబడ్డీ పట్టు
X


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ ని తెరమీద చూసి చాలా కాలమే అవుతోంది. ఆయన చివరగా సర్కారు వారి పాట సినిమాతో 2022లో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ మూవీ పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో ఫ్యాన్స్ చాలా నిరాశకు గురయ్యారు. దీంతో, మహేష్ తదుపరి చిత్రం గుంటూరు కారం పైనే అందరూ ఆశలు పెట్టుకున్నారు.

ఈ మూవీ కూడా షూటింగ్ నేపథ్యంలో ఆలస్యమౌతూ వస్తోంది. ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా వచ్చే ఏడాది కి వాయిదా పడిపోయింది. అయితే, మూవీ ఆలస్యమైనా ఈ సినిమాలో ఫ్యాన్స్ ని సంతోషపెట్టే ఎలిమెంట్స్ ఇందులో చాలా ఉన్నాయి అని తెలుస్తోంది. ముఖ్యంగా ఇందులో త్రివిక్రమ్ మార్క్ కబడ్డీ సీన్స్ ఉంటాయని తెలుస్తోంది.

మహేష్ గతంలో ఒక్కడు సినిమాలో కబడ్డీ ఆడి అందరినీ ఆకట్టుకున్నాడు. ఆ సినిమాకి కబడ్డీ సీన్స్ చాలా హైలెట్ అని చెప్పాలి. ఆ మూవీకి గుణ శేఖర్ దర్శకత్వం వహించారు. మరి ఈ సారి త్రివిక్రమ్ కూడా గుంటూరు కారం కోసం మహేష్ తో కబడ్డీ ఆడించాలని డిసైడ్ అయ్యాడట. మరి ఈ ఆటను త్రివిక్రమ్ ఎలా ఆడిస్తాడో చూడాలి. ఈ విషయం బయటకు వచ్చినప్పటి నుంచి మూవీ పై ఎక్స్ పెక్టేషన్స్ మరింత పెరిగిపోయాయి.

కాగా, తొలి షెడ్యూల్ లోనే ఈ కబడ్డీ సీన్స్ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇంకా, ఈ మూవీలో యాక్షన్ సీన్స్ తెరకెక్కించాల్సి ఉందట. వాటి కోసం హైదరాబాద్ లోని పలు ప్రదేశాలను వెతుకుతున్నట్లు సమాచారం. మంచి లొకేషన్ దొరకగానే, యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తారట. ఇది పూర్తయితే, మూవీ దాదాపు పూర్తయినట్లే అని తెలుస్తోంది.

ఇదిలా ఉండగా, ఈ మూవీలో మహేష్ సరసన శ్రీలీల నటిస్తోంది. నిజానికి మెయిన్ హీరోయిన్ గా పూజా హెగ్డే, సెకండ్ హీరోయిన్ గా శ్రీలీలను తీసుకున్నారు. కానీ, కొన్ని కారణాల వల్ల మొత్తం మారిపోయింది. పూజ ప్లేస్ లోకి శ్రీలల వచ్చేసింది. మరి ఈ సినిమాతో మహేష్ ఎలాంటి రికార్డు క్రియేట్ చేయనున్నాడో చూడాలి.