జక్కన్న మీద మహేష్ గెలిచాడు..
సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కు రెడీ అయ్యారు. న్యూ ఇయర్ వేడుకల కోసం ఆయన విదేశాలకు వెళ్తున్నట్లు తెలుస్తోంది.
By: M Prashanth | 29 Dec 2025 12:14 PM ISTసూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కు రెడీ అయ్యారు. న్యూ ఇయర్ వేడుకల కోసం ఆయన విదేశాలకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఆయన భార్య నమ్రత, పిల్లలతో కలిసి కనిపించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎప్పటిలాగే మహేష్ చాలా కూల్ గా, స్టైలిష్ గా కనిపిస్తూ ఎయిర్ పోర్ట్ లో సందడి చేశారు.
సాధారణంగా రాజమౌళితో సినిమా అంటే హీరోలు బయట ప్రపంచానికి దూరంగా ఉండాల్సిందే. అందులోనూ వారణాసి వెయ్యి కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న గ్లోబల్ అడ్వెంచర్ సినిమా. దీంతో మహేష్ బాబుకి అస్సలు ఖాళీ దొరకదని, షూటింగ్ కోసమే పూర్తి సమయం కేటాయిస్తారని అంతా ఫిక్స్ అయ్యారు. కానీ అనూహ్యంగా మహేష్ ఇలా ట్రిప్ ప్లాన్ చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన కొత్తలో సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో మీమ్స్ వచ్చాయి. జక్కన్న వర్కింగ్ స్టైల్ తెలిసిన వాళ్లు.. ఇక మహేష్ బాబు పాస్ పోర్ట్ రాజమౌళి దగ్గరే లాకైపోతుందని, ఆయన ఎక్కడికీ వెళ్లలేరని జోకులు వేశారు. ఇప్పట్లో ఫారిన్ ట్రిప్స్ కష్టమే అని అనుకున్నారు. కానీ ఆ జోకులన్నింటికీ చెక్ పెడుతూ మహేష్ తనదైన శైలిలో ఫ్యామిలీ టైమ్ ను ఎంజాయ్ చేస్తున్నారు.
ఈ విషయంలో జక్కన్న మీద మహేష్ బాబు గెలిచారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏ హీరోకు సాధ్యం కానిది మహేష్ కు మాత్రమే సాధ్యం అయ్యింది. షూటింగ్ పనుల మధ్యలో ఇలా గ్యాప్ దొరకడం, అది కూడా పండగ సమయంలో వెకేషన్ కి వెళ్లడం చూస్తుంటే.. రాజమౌళి కూడా మహేష్ కోసం కాస్త నిబంధనలు సడలించినట్లు, లేదా షెడ్యూల్స్ ను మహేష్ కు అనుగుణంగా ప్లాన్ చేసినట్లు అనిపిస్తోంది.
మహేష్ వెకేషన్ చూసి ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ సరదాగా జెలస్ గా ఫీల్ అవుతున్నారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాల కోసం వాళ్లు ఏళ్ల తరబడి కష్టపడ్డారు. ఫ్యామిలీకి కూడా టైమ్ ఇవ్వలేనంత బిజీగా గడిపారు. కానీ మహేష్ మాత్రం సినిమా చేస్తూనే తన పర్సనల్ లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకోవడం చూసి, మిగతా హీరోల పరిస్థితిని ఊహించుకుంటూ నెటిజన్లు కొత్త మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.
మొత్తానికి ఈ ట్రిప్ తో మీమర్స్ కు ఒక క్లారిటీ వచ్చేసింది. రాజమౌళి సినిమా ఉన్నా సరే తన వెకేషన్స్ ఆపేదే లేదని సూపర్ స్టార్ ప్రూవ్ చేశారు. కొత్త సంవత్సరం సెలబ్రేషన్స్ పూర్తి చేసుకుని వచ్చాక.. మహేష్ పూర్తి స్థాయిలో జక్కన్న ప్రపంచంలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. ఇక వారణాసి సినిమాలో మహేష్ రుద్ర అనే పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. 2027 సమ్మర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
