Begin typing your search above and press return to search.

మా ఇద్దరిని ఎవరైనా కలిపితే బాగుండు..!

తాజాగా ఒక చిట్‌ చాట్‌ లో కృతి సనన్ మాట్లాడుతూ... జాతీయ అవార్డుల ప్రధానోత్సవం సందర్భంగా మొదటి సారి అల్లు అర్జున్‌ ను కలిశాను.

By:  Tupaki Desk   |   29 Nov 2023 2:30 AM GMT
మా ఇద్దరిని ఎవరైనా కలిపితే బాగుండు..!
X

మహేష్ బాబు, సుకుమార్‌ కాంబోలో వచ్చిన 1 నేనొక్కడినే సినిమాతో దాదాపు దశాబ్ద కాలం క్రితం ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ కృతి సనన్‌. ఈ అమ్మడు తెలుగు లో పెద్దగా క్రేజ్ దక్కించుకోలేక పోయింది. అయితే అదృష్టం బాగుండి బాలీవుడ్‌ నుంచి ఆఫర్లు వచ్చి, అక్కడ బడా స్టార్స్ కి జోడీగా నటించి స్టార్‌ హీరోయిన్ గా మారింది.

ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ కు జోడీగా నటించిన కృతి సనన్ మళ్లీ తెలుగు సినిమాలో నటించాలని కోరుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చింది. ఇటీవల జాతీయ అవార్డును ఉత్తమ నటి కేటగిరీలో అందుకున్న కృతిసనన్‌ ఆ సమయంలో అల్లు అర్జున్‌ ను కలిసిందట. అప్పటి నుంచి ఆయనతో కలిసి నటించాలని ఉవ్విల్లూరుతూ ఉందట.

తాజాగా ఒక చిట్‌ చాట్‌ లో కృతి సనన్ మాట్లాడుతూ... జాతీయ అవార్డుల ప్రధానోత్సవం సందర్భంగా మొదటి సారి అల్లు అర్జున్‌ ను కలిశాను. ఆయన గొప్ప మేధావి గా మాట్లాడారు. అంతే కాకుండా ఆయన గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా అనిపించారు. అలాంటి నటుడితో కలిసి నటించాలని తాను కోరుకుంటున్నాను అంది.

ఏ దర్శకుడు అయినా మా ఇద్దరి కోసం కథను తీసుకు వస్తే బాగుండు అని ఎదురు చూస్తున్నాను. మా ఇద్దరిని కలిపి సినిమాను తీసేందుకు ఎవరైనా దర్శకుడు వస్తే బన్నీ తో కలిసి నటించేందుకు రెడీ గా ఉన్నాను అంటూ కృతి సనన్‌ ఆ చిట్‌ చాట్‌ లో చెప్పి అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం బన్నీ ఫ్యాన్స్‌ ఈ విషయాన్ని తెగ షేర్‌ చేస్తున్నారు.

ఇక బన్నీ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం పుష్ప 2 సినిమాను చేస్తున్నాడు. ఆ తర్వాత బోయపాటి దర్శకత్వంలో ఒక సినిమాను జెట్‌ స్పీడ్‌ తో చేసి, ఆ వెంటనే త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఒక సినిమాను చేయబోతున్నాడు. ఆ తర్వాత సందీప్ వంగ దర్శకత్వంలో కూడా ఒక సినిమాను చేయబోతున్నాడు. ఇన్ని సినిమాల్లో నటిస్తున్న బన్నీ బాబు ఏదైనా ఒక్క సినిమాలో అయినా కృతి సనన్‌ కి జోడీగా సినిమాను చేస్తాడేమో చూడాలి.