Begin typing your search above and press return to search.

రాష్ట్ర‌ప‌తితో క్యూట్ క్లిన్ కారా భేటీ

ఈ సందర్భంగా అయోధ్య బలరాముడిని దర్శించుకుని అక్కడ ప్రత్యేక పూజలు చేశారు.

By:  Tupaki Desk   |   16 March 2024 6:23 AM GMT
రాష్ట్ర‌ప‌తితో క్యూట్ క్లిన్ కారా భేటీ
X

మెగా కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల తన కుమార్తె క్లిన్ కారతో కలిసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిశారు. ఈ సందర్భంగా ఉపాసన ఆసక్తికరం పోస్ట్ షేర్ చేసారు.ఇటీవల ఉపాసన తన తాత, అపోలో వ్యవస్థాపకుడు ప్రతాప్ రెడ్డి ఇతర కుటుంబ సభ్యులతో కలిసి అయోధ్య ఆలయాన్ని సందర్శించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అయోధ్య బలరాముడిని దర్శించుకుని అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు ఆమె యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కలిశారు.


ఇప్పుడు రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్మును గౌర‌వ‌పూర్వ‌కంగా క‌లిసి వ‌చ్చారు. అక్కడ ప్ర‌ముఖుల‌ను కలిసిన ఉపాసన ఇందుకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేశారు. రాష్ట్రపతిని కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఉపాసన తన పోస్ట్‌లో ఇలా రాసారు.


ఈ రోజు అంతర్గత, ప్రపంచ శాంతి కోసం జరిగిన హార్ట్‌పుల్ నెస్‌ గ్లోబల్ మహోత్సవ్‌ లో గౌరవనీయులైన భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ముజీని నా కుమార్తె క్లింకార కొణిదెలతో కలవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అలాగే కమలేశ్‌ దాజీ జీ మీరు నిజంగా ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చారు. ముఖ్యంగా ఈ ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చుతున్న కమలేశ్‌ దాజీ జీకి ప్రత్యేక ధన్యవాదాలు. నేను నా బిడ్డ కూడా అన్ని సానుకూలతలను స్వీకరించేందుకు ఇక్కడికి తీసుకువచ్చాము.. అంటూ ఉపాసన తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ షేర్‌ చేశారు. ప్రస్తుతం ఆమె పోస్ట్‌ వైరల్‌గా మారింది. రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం `గేమ్ ఛేంజ‌ర్` చిత్రంలో న‌టిస్తూ బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.