యుద్ధ భయాల వేళ ఆ ఇద్దరు హీరోలు వెనక్కి తగ్గారా?
ఈ నేపథ్యంలో టాలీవుడ్లో భారీ పాన్ ఇండియా సినిమాల రిలీజ్లు కూడా వాయిదా పడే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.
By: Tupaki Desk | 10 May 2025 10:45 AM ISTపహల్గవ్ ఘనకు ప్రతికారం తీర్చుకుంటూ భారత్ ఆక్రమిత కాశ్మీర్లోని టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్లపై మెరుపు దాడికి దిగడంతో పాక్ తన కుటిల బుద్ధిని ప్రదర్శస్తూ తుర్కియే డ్రోన్లతో సరిహద్దులో ఉన్న భారత్ జనవాసాలు, ఆలయాలపై దాడికి ప్రయత్నిస్తూ మనపై వార్ ప్రకటించిన విషయం తెలిసిందే. పాక్ కుటిలత్వాన్ని పసిగట్టిన భారత సేన వారికి ధీటుగా సమాధానం చెబుతూ డ్రోన్ దాడుల్ని సమర్ధవంతంగా తిప్పికొడుతోంది. దీంతో యుద్ధవాతావరణం రోజు రోజుకూ వేడెక్కుతోంది.
ప్రపంచ వ్యాప్తంగా భారత్ - పాక్ యుద్ధంపై ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పాక్కు మద్దతుగా తుర్కియే నిలవడం, డ్రోన్లని పాక్కు అందించడంతో వాటిని ధీటుగా భారత్ తిప్పికొడుతూ పాక్కు బుద్ధి చెబుతోంది. రోజు రోజుకూ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పాతక స్థాయికి చేరుకున్న వేళ ఐపీఎల్ని రద్దు చేయడం, పలు విమానాలని రద్దు చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో టాలీవుడ్లో భారీ పాన్ ఇండియా సినిమాల రిలీజ్లు కూడా వాయిదా పడే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన భారీ పాన్ ఇండియా మూవీ 'కింగ్డమ్'. గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న ఈ సినిమాని భారీ స్థాయిలో మే 30న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఇప్పటికే ఫస్ట్ సింగిల్ని కూడా విడుదల చేసి ప్రమోషన్స్ని టీమ్ మొదలు పెట్టింది. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో 'కింగ్డమ్' రిలీజ్వాయిదా పడుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. కారణం ఉత్తరాదిలో యుద్ధం ఎఫెక్ట్ తీవ్రస్థాయిలో ఉండటం, థియేటర్లకు అధిక సంఖ్యలో ప్రేక్షకుల వచ్చే అవకాశం లేదని తేలడంతో ఈ మూవీ రిలీజ్ని మేకర్స్ వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలిసింది.
ఇదే తరహాలో పవన్ కల్యాణ్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ 'హరి హర వీరమల్లు' రిలీజ్ కూడా వాయిదా పడినట్టుగా తెలుస్తోంది. గత కొంత కాలంగా ప్యాచ్ వర్క్ కారణంగా రిలీజ్ వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ భారత్ - పాక్ యుద్ధం కారణంగా మరో సారి వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది. మరీ ప్రధానంగా పాన్ ఇండియా సినిమాలకు హిందీ బెల్ట్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండటంతో మేకర్స్ ఈ మూవీ రిలీజ్ని వాయిదా వేయాలని భావిస్తున్నారట.
ఈ రెండు సినిమాల రిలీజ్లు వాయిదా పడే అవకాశం ఉండటంతో ఆ టైమ్ని వినియోగించుకోవాలని బెల్లంకొండ శ్రీనివాస్ టీమ్ ప్లాన్ చేస్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా మంచు మనోజ్, నారా రోహిట్ కీలక పాత్రల్లో నటించారు. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ మూవీని మే 30న రిలీజ్ చేస్తున్నామంటూ ఇటీవల టీమ్ ప్రకటించింది. బడ్జెట్ పరంగా ఎలాంటి రిస్క్ లేకపోవడంతో 'భైరవం' టీమ్ ఈ 30న ప్రేక్షకుల ముందుకొస్తోంది. కింగ్డమ్, హరి హర వీరమల్లు రిలీజ్ కారణంగా ఆ డేట్ని వాడుకోవడానికి కొంత మంది నిర్మాతలు సంకోచిస్తే 'భైరవం' టీమ్ మాత్రం ఆ డేట్ని సరైన టైమ్లో క్యాచ్ చేయడం విశేషం.