Begin typing your search above and press return to search.

మ‌రో ఇద్ద‌రు వారుసుల ఎంట్రీ షురూ

బాలీవుడ్ కి మ‌రో ఇద్ద‌రు వారుసులు ఎంట్రీ ఇచ్చేసారు. ఖుషీ క‌పూర్ వెండి తెరంగేట్రం ఎప్పుడు ఉంటుం దా? అని ప్రేక్ష‌కులు ఎంతో కాలంగా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

By:  Tupaki Desk   |   22 Jan 2024 12:30 PM GMT
మ‌రో ఇద్ద‌రు వారుసుల ఎంట్రీ షురూ
X

బాలీవుడ్ కి మ‌రో ఇద్ద‌రు వారుసులు ఎంట్రీ ఇచ్చేసారు. ఖుషీ క‌పూర్ వెండి తెరంగేట్రం ఎప్పుడు ఉంటుం దా? అని ప్రేక్ష‌కులు ఎంతో కాలంగా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. `ది అర్చిస్` తో ఖుషీ మ్యాక‌ప్ వేసుకున్నా అభిమానుల‌కు అది అంత కిక్ దొర‌క‌లేదు. థియేట్రిక‌ల్ రిలీజ్ కాక‌పోవ‌డంతో ఎలాంటి హంగామా క‌నిపించ‌లేదు. దీంతో ఖుషీ హీరోయిన్ అయ్యేది ఎప్పుడు? అనే ఆస‌క్తి మ‌రింత రెట్టింపు అయింది.

తాజాగా ఆ బ్యూటీ కూడా సినిమాతో మెప్పించ‌డానికి రెడీ అయింది. ఇదే సినిమాతో స్టార్ హీరో సైఫ్ అలీఖ‌న్ కుమారుడు ఇబ్ర‌హీం అలీఖాన్ కూడా తెరంగేట్రం చేస్తున్నాడు. ఆ ర‌కంగా ఇద్ద‌రు వారసుల ఎంట్రీ ఒకేసారి లాంఛ‌న‌మైంది. ఇద్ద‌రు ఓ రొమాంటిక్ ఎంట‌ర్ టైనర్ తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు. వారిని ప‌రిచ‌యం చేసే బాధ్య‌త‌ని క‌ర‌ణ్ జోహార్ తీసుకున్నారు. వాస్త‌వానికి ఈ సినిమాకి ద‌ర్శ‌క‌-నిర్మాత క‌ర‌ణ్ వ్య‌వ‌రిస్తార‌ని బ‌ల‌మైన ప్ర‌చారం సాగింది.

కానీ క‌ర‌ణ్ మాత్రం ఆ ఛాన్స్ తీసుకోలేదు. కేవ‌లం నిర్మాత‌గానే ఉంటూ ద‌ర్శ‌క‌త్వం బాధ్య‌త‌లు ఆయ‌న శిష్యు రాలైన శౌనా గౌత‌మ్ కి అప్ప‌గించారు. ధ‌ర్మాటిక్ ఎంట‌ర్ టైన్ మెంట్స్ పై ఈ చిత్ర నిర్మాణం జ‌రుగుతుంది. శానౌ నా ప్రేమ ఆశిస్సులు ఎల్లుప్పుడు ఉంటాయి. లెట్స్ గో డే వ‌న్ అంటూ క‌ర‌ణ్ ఓ పోస్ట్ చేసారు. దీంతో శిష్యురాలికి ధైర్యం చెప్పి సెట్స్ కి పంపిస్తున్న‌ట్లు తెలుస్తుంది.

ఓ పిక్ లో శౌనా క్లాప్ బోర్డ్ ప‌ట్టుకుని క‌నిపించ‌డంతో ఈ సినిమా లాంచ‌నంగా ప్రారంభ‌మైన‌ట్లు తెలుస్తుం ది. అయితే డెబ్యూ విష‌యంలో ఇంకా ఖుషీ గానీ...ఇబ్ర‌హీం గానీ స్పందించ‌లేదు. క‌ర‌ణ్ నుంచి ఆదేశాలు వ‌చ్చే వ‌ర‌కూ ఇద్ద‌రు ఎలాంటి అప్ డేట్ ఇచ్చే అవ‌కాశం లేదు. జాన్వీ క‌పూర్ ని కూడా లాంచ్ చేసింది క‌ర‌ణ్ జోహార్ అన్న సంగ‌తి తెలిసిందే.